IB Report On Ys Jagan Security: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలనే పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికను కోర్టుకు సమర్పించింది. జగన్ గారికి ప్రస్తుతం ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేదని ఐబీ తెలిపింది. అయితే, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కేంద్రం సమయం కోరింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. ఈ కేసులో ఇంకా ఏం జరగనుందో వేచి చూడాలి.
హైలైట్:
- జగన్ భద్రత అంశంపై హైకోర్టులో విచారణ
- జగన్ భద్రతపై ఐబీ రిపోర్ట్ అందజేసింది
- కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం

వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ (IB) కీలక రిపోర్టు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు భద్రతను తగ్గించారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరుగుతుండగా.. ఐబీ కేంద్రానికి నివేదికను సమర్పించింది. ఈ విషయాన్ని కేంద్రం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ విచారణను వాయిదా వేసింది. అంతేకాదు ఇటీవల రెంటపాళ్లలో తన భద్రతకు సంబంధించిన అంశం.. అలాగే రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం దగ్గర ఇద్దరు యువకులు తాటికాయలు విసరడం కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.. వైఎస్ జగన్కు భద్రత పెంచాలని కోరింది.