Pawan Kalyan Morphing Photos: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం యోగా దినోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి, తప్పుగా పోస్టులు పెట్టారని జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. కాకినాడ ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కర్రి వెంకట సాయివర్మ, పాముల రామాంజనేయులు, షేక్ మహబూబ్ ఉన్నారు. మరికొందరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
హైలైట్:
- పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలతో పోస్ట్లు
- పోలీసులకు జనసేన పార్టీ నేతల ఫిర్యాదు
- ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కళ్యాణ్పై మార్ఫింగ్ ఫోటోలతో అభ్యంతరకరంగా.. హైదరాబాద్ యువకుడు సహా ముగ్గురు అరెస్ట్
విశాఖపట్నంలో ఈ నెల 21న జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారు.. డిప్యూటీ సీఎంను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. దీనిపై పిఠాపురంలో జనసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వెంటనే విచారణ జరిపి ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. గతంలో కూడా కొందరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కేసుల్లో అరెస్టైన సంగతి తెలిసిందే.