ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు మానవ మెదడుపై ఆవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ వివాదం కాస్తా ఆయన ఉద్యోగానికి ఎసరుపెట్టే స్థాయికి చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా, యాలాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులకు మానవ మెదడు పనితీరుపై అవగాహాన కల్పించాలనుకున్నాడు. అయితే వారికి చక్కగా ఆర్థం అయ్యే విధంగా వివరించేందుకు.. ఉదహారణగా ఒక ఆవు మెదడును తరగతి గదిలోకి తీసుకొచ్చాడు. విద్యార్థులకు ఆ ఆవు మెదడును ప్రత్యక్షంగా చూయిస్తూ మెదడు పనితీరుపై అవగాహన కల్పించాడు. ఈ విషయం స్థానిక హిందువుల దృష్టికి చేరడంతో ఇది కాస్తా వివాధానికి దారి తీసింది.
ఈ వ్యవహారంపై స్థానిక హిందువాదులు, బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోమాతగా భావించే ఆవు మెదడుతో ఇలా విద్యార్థులకు అవగాహన కల్పించడం ఏంటని మండిపడ్డారు. భారీ సంఖ్యలో ఇందువులు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. సదురు సైన్స్ టీచర్పై చర్యలు తీసుకోవాలని.. అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వీడియో చూడండి..
మరోవైపు స్కూల్ వద్ద గందరగోళం నెలకొన్ని విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కూల్ వద్ద ఆందోళనకు దిగిన హిందూవాదులకు, బీజేపీ నాయకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..