ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సుమారు మూడేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఎన్నిరోజులకు మంజూరు చేస్తారనే దానిపై అధికారులు పలు వివరాలు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు, విభజన వంటి వాటికి 21 రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు. అలాగే ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు అందించే అవకాశం ఉందని సమాచారం.

* ఏపీలోని రేషన్ కార్డుదారులకు అలర్ట్.. వారికి బియ్యంకార్డులు బంద్!
అయితే రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడానికి, అలాగే రేషన్ కార్డుల విభజన, కొత్త సభ్యులను రేషన్ కార్డులో చేర్చేందుకు, చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు.. దరఖాస్తు చేసిన తర్వాత 21 రోజుల వరకూ సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు.
*కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్లో సమస్యలు.. అక్కడకు క్యూ, మీరు కూడా ఉన్నారా?
బియ్యం కార్డులలో అడ్రస్ మార్చుకోవడానికి, పేర్లు సరిచేసుకోవడానికి ఏడు రోజుల సమయం పడుతుందంటున్నారు. సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత.. వారి వివరాలు ఆన్లైన్ నుంచి సిబ్బంది లాగిన్కు పంపుతారు. అలా వచ్చిన వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేస్తున్నారు.
AP Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఎన్ని రోజులకు జారీ చేస్తారంటే?
మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డుల సేవలు పొందవచ్చు.మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 కు హాయ్ మెసేజ్ పంపి.. అందులో అడిగిన వివరాలను సమర్పించడం ద్వారా రేషన్ కార్డుల మార్పులు, చేర్పులకు అధికారులు అవకాశం కల్పించారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉందని అధికారులు చెప్తు్న్నారు. ప్రస్తుతానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. ఇది నిరంతరం జరుగుతుందని వెల్లడించారు. ఆగస్ట్ నెలలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉందని సమాచారం.