క్షణికావేశంలో మనుషులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. డబ్బుల కోసం ఏం చేయడానికైనా వెనుకడుగు వేయడం లేదు. సొంత కుటుంబ సభ్యులపైన దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. హావేలి ఘన్ పూర్ మండలం ఔరంగాబాద్ తండాలో రైతు భరోసా పైసల కోసం తండ్రి నాలుకను కోసాడు ఓ కోడుకు. రైతుభరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తనకివ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి తన కన్నతండ్రి నాలుక కోశాడు.
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బానో త్ పిర్యాకు ఎకరం భూమి ఉంది. రైతు భరోసా కింద అతని బ్యాంకు ఖాతాలో రూ.8వేలు జమ అయ్యాయి. కాగా ఆ డబ్బు డ్రా చేసుకుని ఇంటికి వచ్చాడు. పిర్యా కుమారుడు సంతోష్ రైతుబందు డబ్బులను తనకు ఇవ్వాలని తండ్రితో గొడవపద్దాడు. 8 వేల రూపాయల నుండి 2 వేల రూపాయలు ఖర్చు అయ్యాయని తండ్రి చెప్పగా.. మొత్తం డబ్బులు ఇవ్వాలని తండ్రితో గొడవపడ్డాడు కొడుకు సంతోష్.
అయితే తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆ గొడవలో కోపంలో ఉన్న కొడుకు సంతోష్ తండ్రి నాలుకను కోశాడు. ఇది గమనించిన చుట్టూ పక్కల వారు, తండ్రి పిర్యాను మెదక్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే గతంలో కూడా చాలాసార్లు తండ్రి, కొడుకుల మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని స్థానికులు తెలిపారు. ఇటీవల కూడా డబ్బులు ఇవ్వలేదని తండ్రి వేసుకునే చెప్పుల్లో చిన్న చిన్న ఇనుప మొలలు పెట్టడంతో గాయాలు అయ్యాయని గ్రామస్తులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..