TDP Sugavasi Bala Subramanyam YSRCP,అధికార టీడీపీకి బిగ్ షాక్.. 40 ఏళ్ల బంధాన్ని తెంచుకుని వైసీపీలో చేరిన సీనియర్ లీడర్ – tdp senior leader sugavasi bala subramanyam joins ysrcp in the presence of ys jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఇటీవల రాజీనామా చేశారు. తాజాగా వైసీపీలో చేరుతూ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక టీడీపీలో విభేదాలే సుగవాసి బాలసుబ్రమణ్యం పార్టీ మార్పునకు కారణమని తెలుస్తోంది.
వైసీపీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీకి షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు.. విపక్ష వైసీపీ లో చేరిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్ని రోజులుగా టీడీపీ అధిష్టానం మీద గుర్రుగా ఉన్న సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన సుగవాసి బాలసుబ్రమణ్యం కుటుంబం సుమారు 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వస్తోంది. టీడీపీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం 1995లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాయచోటి జడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం కడప జిల్లా పరిషత్ ఛైర్మన్గానూ పనిచేశారు. 2012లో రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికలప్పుడు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. తనకు తగినంత ప్రాధాన్యం లభించలేదని గత కొంతకాలంగా సుగవాసి బాలసుబ్రమణ్యం అసంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలోనే కడపలో టీడీపీ మహానాడు జరిగిన పది రోజుల తర్వాత సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తూ టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్లు అధినేత చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖ పంపారు.
అధికార టీడీపీకి బిగ్ షాక్.. 40 ఏళ్ల బంధాన్ని తెంచుకుని వైసీపీలో చేరిన సీనియర్ లీడర్
రాజంపేట నియోజకవర్గం టీడీపీలో విభేదాల వలనే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది.రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, సుగవాసి సుబ్రహ్మణ్యం మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సుగవాసి సుబ్రమణ్యం టీడీపీని వీడి వైసీపీలో చేరినట్లు తెలిసింది. మరోవైపు సుగవాసి బాలసుబ్రమణ్యం తండ్రి.. సుగవాసి పాలకొండ్రాయడు చనిపోయినప్పుడు.. పార్టీ తరుఫున ఎవరూ రాలేదనే ఆవేదనతోనూ ఆయన ఉన్నట్లు సమాచారం.
రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి