అట్లీ సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ అనుకున్నా.. చివరి నిమిషంలో ఆయన సైడ్ అయిపోయి అట్లీ ట్రాక్లోకి వచ్చారు. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
బన్నీ కూడా ఈ షెడ్యూల్లో ఉన్నారు. అక్కడే మూడు నెలల భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు అట్లీ. అందులో యాక్షన్ సీక్వెన్సులు కూడా చిత్రీకరించబోతున్నారు. AA22 ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్తో వస్తుంది.
దీనికోసం భారీగా విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర విఎఫ్ఎక్స్ కోసం ఫారెన్ VFX కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముంబై షెడ్యూల్లో మేజర్ యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేస్తున్నారు అట్లీ.
జులై ఫస్ట్ వీక్లో మాత్రం షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చి.. అమెరికన్ తెలుగు సంబరాల్లో పాల్గొనడానికి USA వెళ్లనున్నారు బన్నీ.సెప్టెంబర్ వరకు ముంబై షెడ్యూల్ జరగనుంది. దీని తర్వాత బన్నీ సహా యూనిట్ అంతా USలో VFX బేస్డ్ సీన్స్ షూట్ చేయనున్నారు.
ఇందులో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమెతో పాటు మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా నటించబోతున్నారు. 2027లో అల్లు అర్జున్, అట్లీ సినిమా రానుంది. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.