పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెళ్లికి నిరాకరించినందుకు నాగమణి అనే వివాహితపై హేమంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, నిందితుడు పరారీలో ఉన్నాడు. మరోవైపు అనంతపురంలో వివాహేతర సంబంధం కారణంగా భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

అయితే పెళ్లైనప్పటికీ హేమంత్ ప్రవర్తనలో మార్పు రాలేదు. పెళ్లి చేసుకోవాలంటూ నాగమణిని వేధించడం మొదలుపెట్టాడు. అయితే నాగమణి అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం హేమంత్.. నాగమణి ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి గొడవపడ్డాడు. నాగమణి అంగీకరించకపోవటంతో కోపంతో ఆమెపై దాడి చేశాడు. బ్లేడుతో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భీమవరం ఆస్పత్రిలో నాగమణి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భీమవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న హేమంత్ కోసం గాలిస్తున్నారు.
మరోవైపు అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేయించిందో భార్య. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య.. తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయించింది. రాత్రిపూట భర్త ఒంటరిగా ఇంటికి వస్తున్న విషయాన్ని.. ప్రియుడికి ఫోన్ ద్వారా చేరవేసి.. అతనితో ప్లాన్ ప్రకారం హత్య చేయించింది. అయితే ఈ హత్య కేసును అనంతపురం పోలీసులు ఆరు గంటల్లోనే ఛేదించారు. భార్యను, అతని ప్రియుణ్ని అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలించారు. అటు తెలంగాణలోని గద్వాలలోనూ సర్వేయర్ తేజేశ్వర్ను అతని భార్య హత్య చేయించిన ఘటన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.