నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీళ్లు తాగమని దాదాపు ప్రతి ఇంట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇలా తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే కాలేయం, మూత్రపిండాలు, గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాయి. కానీ నీళ్లలో కాసిన్ని బెండకాయ ముక్కలు వేసి నానబెట్టి తాగారంటే రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చు.
బెండకాయల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ కె, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకంతో బాధపడేవారికి ఈ నీళ్లు మ్యాజిక్ టానిక్ మాదిరి పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.
అంతే కాదు, రక్తంలో చక్కెర సమస్యలతో బాధపడేవారు బెండకాయ నీటిని క్రమం తప్పకుండా తాగాలి. ఈ నీళ్లు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్తో బాధపడేవారికి ఇది గొప్ప ఫలితాలను ఇస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాలు త్వరగా నయం అవుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకుంటే, ఏడు రోజుల్లో బరువు తగ్గడం ఖాయం. బెండ బరువును తగ్గించడమే కాకుండా, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది చర్మం పొడిబారడాన్ని కూడా తొలగిస్తుంది.
రాత్రిపూట ఒక గాజు సీసాలో నీటితో నింపి, అందులో తరిగిన బెండ ముక్కలు వేయాలి. దీన్ని రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం వడకట్టి, గ్లాసు నీటిని తాగితే సమస్య తొలగిపోతుంది.