Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Jagannath Rath Yatra: జగన్నాథుని అత్త ఎవరు? ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్తాడు? అత్త ఇచ్చే విందుని ఏమంటారో తెలుసా..

26 June 2025

24 గంటల్లో మీ ఆరోగ్యాన్ని మార్చే మ్యాజిక్.. వీటికి దూరంగా ఉంటే చాలు..!

26 June 2025

Pawan Kalyan: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

26 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh E Passports,ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ-పాస్‌పోర్ట్‌లు వచ్చేశాయి, ఇకపై ఇమిగ్రేషన్‌ ఈజీగా! – e passports launched in andhra pradesh for easy immigration
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh E Passports,ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ-పాస్‌పోర్ట్‌లు వచ్చేశాయి, ఇకపై ఇమిగ్రేషన్‌ ఈజీగా! – e passports launched in andhra pradesh for easy immigration

.By .26 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh E Passports,ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ-పాస్‌పోర్ట్‌లు వచ్చేశాయి, ఇకపై ఇమిగ్రేషన్‌ ఈజీగా! – e passports launched in andhra pradesh for easy immigration
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh E Passport Details: ఆంధ్రప్రదేశ్‌లో ఈ-పాస్‌పోర్టుల జారీ ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ పాస్‌పోర్టుల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ ఉంటుంది, దీని ద్వారా వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా, పాస్‌పోర్టుల తనిఖీల్లో ఏపీ పోలీసులు మూడు రోజుల్లోనే పూర్తి చేసి అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ధ్రువపత్రాన్ని అందజేసింది.

హైలైట్:

  • ఏపీలో ఈ-పాస్‌పోర్టులు జారీ చేస్తున్నారు
  • విశాఖపట్నం, విజయవాడలో ప్రారంభం
  • ఇమిగ్రేషన్‌ ప్రక్రియను మరింత సులువు
ఏపీలో ఈ పాస్‌పోర్ట్స్ జారీ
ఏపీలో ఈ పాస్‌పోర్ట్స్ జారీ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో ఈ-పాస్‌పోర్టులు వచ్చేశాయి.. ఇమిగ్రేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసే ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తున్నారు. విశాఖపట్నంతో పాటుగా విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కేంద్రం పీఎస్‌పీ వెర్షన్ 2.0లో భాగంగా ఈ పాస్‌పోర్టుల్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న పాస్‌పోర్టుల స్థానంలో ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) చిప్‌తో ఈ-పాస్‌పోర్టులు ఇస్తున్నారు. ఈ చిప్‌లో పాస్‌పోర్ట్‌కు సంబంధించి వ్యక్తి పూర్తి సమాచారం ఉంటుంది. అప్పుడు ఇమిగ్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తవుతుందని భావిస్తున్నారు.

కొత్తగా జారీ చేస్తున్న ఈ-పాస్‌పోర్టులో ఒక చిప్ ఉంటుంది. పాస్‌పోర్ట్ మొదటి పేజీలో ఒక కోడ్ ఉంటుంది.. దానిని స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. ఈ పాస్‌పోర్టులతో నకిలీవి తయారు చేయకుండా అడ్డుకట్ట వేయొచ్చంటున్నారు. కొత్తగా జారీ చేస్తున్న ఈ-పాస్‌పోర్ట్‌పై గోల్డ్ కలర్ చిప్ గుర్తు ఉంటుంది. విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి రాగా.. విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం గత నెల 4 నుంచి ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు 25,000 ఈ-పాస్‌పోర్టుల్ని జారీ చేశారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్‌లు ఉన్నవారికి ఆ గడువు ఉన్నంత వరకు చెల్లుబాటు అవుతాయి. ఆ పాస్‌పోర్టుల్ని రెన్యువల్ చేసేప్పుడు ఈ-పాస్‌పోర్టు ఇస్తారు. అయినా సరే ఒకవేళ ఎవరికైనా కొత్త ఈ-పాస్‌పోర్ట్ కావాలంటే.. రీ-ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వారు స్లాట్ బుక్ చేసుకుని, వెరిఫికేషన్ పూర్తయితే ఈ-పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ఈ-పాస్‌పోర్ట్‌లు వచ్చేశాయి, ఇకపై ఇమిగ్రేషన్‌ ఈజీగా!

మరోవైపు ఏపీ పోలీసు శాఖ పాస్‌పోర్టుల దరఖాస్తుల తనిఖీల్లో అరుదైన ఘనత సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్ట్ తనిఖీలను పూర్తి చేస్తోంది.. అందుకు గుర్తింపుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా.. ఏపీ నిఘా విభాగం ఎస్పీ ఎ.రమాదేవికి ప్రత్యేక ధ్రువపత్రాన్ని అందజేశారు. 2024-25లో ఏపీ పోలీసు శాఖ అత్యంత వేగంగా పాస్‌పోర్టు దరఖాస్తుల తనిఖీ ప్రక్రియను పూర్తిచేసి.. అత్యుత్తమ సేవలందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. 2018-2019లో కూడా ఈ అవార్డు వచ్చింది అంతేకాదు గుంటూరు పోస్టాఫీస్ కార్యాలయంలోని పాస్‌పోర్టు సేవా కేంద్రానికి సంస్థాగత పనితీరు పురస్కారం దక్కింది. అలాగే విజయవాడ రీజినల్‌ పాస్‌పోర్టు అధికారికి వ్యక్తిగత అవార్డు వచ్చింది. ఈ గుర్తింపుతో మరింత అత్యుత్తమ పౌరసేవలు అందించేందుకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా. ఇంటిలిజెన్స్ చీఫ్ మహేష్‌ చంద్ర లడ్డాతో పాటుగా ఇంటిలిజెన్స్ ఎస్పీ రమాదేవి, అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లను డీజీపీ అభినందించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Pawan Kalyan: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

26 June 2025

Pawan Kalyan: అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన – ap deputy cm pawan kalyan and union minister shekhawat lay foundation for akhanda godavari project

26 June 2025

Andhra Weather: అన్నోయ్.. బంగాళాఖాతంలో అల్పపీడనమట – వానలు దంచుడే

26 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Jagannath Rath Yatra: జగన్నాథుని అత్త ఎవరు? ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్తాడు? అత్త ఇచ్చే విందుని ఏమంటారో తెలుసా..

26 June 2025

జగన్నాథ ఆలయ రథయాత్ర అనేది భారతదేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు పూరీకి చేరుకునే…

24 గంటల్లో మీ ఆరోగ్యాన్ని మార్చే మ్యాజిక్.. వీటికి దూరంగా ఉంటే చాలు..!

26 June 2025

Pawan Kalyan: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

26 June 2025

Amazon: అమెజాన్‌లో క్రెడిట్ కార్డులపై బంపర్ ఆఫర్లు.. లింక్ చేసుకోవడం చాలా ఈజీ

26 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Jagannath Rath Yatra: జగన్నాథుని అత్త ఎవరు? ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్తాడు? అత్త ఇచ్చే విందుని ఏమంటారో తెలుసా..

26 June 2025

24 గంటల్లో మీ ఆరోగ్యాన్ని మార్చే మ్యాజిక్.. వీటికి దూరంగా ఉంటే చాలు..!

26 June 2025

Pawan Kalyan: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

26 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.