ప్రస్తుతం రెయినీ సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల అయితే కుండపోత వర్షం కురోస్తోంది. దీంతో కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు, వరదలకు జంతువులు, పాములు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఓ పాము ఉత్తర్ ప్రదేశ్లో కొత్తగా నిర్మిస్తోన్న ఓ ఇంట్లోకి వచ్చి కన్నంలో నక్కింది. అది ఏకంగా అక్కడ గుడ్లు పెట్టడం విశేషం. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లాకు సమాచారం ఇచ్చారు. అతను పామును, దాని గుడ్లను రక్షించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను 30 లక్షల మందికి పైగా వీక్షించారు.
మొదట అతను రంధ్రం చుట్టూ ఉన్న మట్టిని తొలగించాడు. ఆ సమయంలో పాము ఉందని అనుమానించిన అతను రాడ్ సహాయంతో దానిని బయటకు తీసి దాన్ని జాగ్తత్తగా ఓ డబ్బాలో బంధించాడు. ఆపై గుడ్లను బయటకు తీసి ఓ జాడిలో జాగ్రత్తగా పెట్టాడు. ఈ స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ను చూడటానికి స్థానికులు ఆసక్తి కనబరిచారు.
ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో @murliwalehausla24 అనే అకౌంట్ నుంచి “ఇన్ని గుడ్లు పెట్టిన తర్వాత నాగుపాము ఎక్కడ దాక్కుంది, దాన్ని ఎలా రక్షించారు?” అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు.
వీడియోపై యూజర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నీ ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను”, “నువ్వు నిజంగా ధైర్యవంతుడివి”, “మహాదేవ్ నిన్ను కాపాడుగాక” వంటి కామెంట్లు వచ్చాయి. మరికొందరు “హ్యాండ్ గ్లౌజులు ధరిస్తే నీకు రిస్క్ ఉండదు” అని సలహా ఇచ్చారు.
వీడియో దిగువన చూడండి..