కట్టుకున్న భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిస్తే ఆలోచించకుండా దారుణాలకు ఒడిగడుతున్న ఈ రోజుల్లో..ఓ వ్యక్తి మాత్రం తన భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లై 15 ఏళ్ల తర్వాత తన భార్యకు ఆమె, ప్రియుడితో వివాహం జరిపించాడు. వివరాల్లోకి వెళితే, దేహత్ జిల్లా రసూలాబాద్కు చెందిన యోగేష్ తివారీ (40) అనే వ్యక్తికి ఔరంగాపూర్కు చెందిన సోని అనే మహిళతో 2010లో వివాహం జరిగింది. తర్వాత వీరు ఒక మడ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ పిల్లాడి వయస్సు12 ఏళ్ల. అయితే కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత సోని కన్నౌజ్కు చెందిన వికాస్ ద్వివేది అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కాస్త భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.
అయితే, ఈ మధ్య కాలంలో తన పుట్టింటికి వెళ్లిన సోని సోమవారం తిరిగి అత్తింటికి వచ్చింది. సరిగ్గా అదే రోజు ఆమె ప్రియుడు వికాస్ కూడా వాళ్ల గ్రామానికి వచ్చాడు. దాన్ని గమనించిన సోని భర్త వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషం చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వికాస్ ఆ గ్రామం నుంచి పారిపోయాడు. ఇక ఇంటికి వెళ్లిన యోగేష్ వివాహేతర సంబంధంపై భార్యను మరోసారి నిలదీశాడు. ఆమె ఇష్టాన్ని తెలసుకొని.. వికాస్ను తిరిగి రమ్మని చెప్పాడు. తర్వాత విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి.. అందరి సమక్షంలో పంచాయితీ జరిపారు. ఈ పంచాయితిలో సోని తన ప్రియుడితో వివాహానికి లిఖితపూర్వంగా అంగీకరించి.. తన భర్తతో ఉన్న వివాహ బందానికి గుడ్బై చెప్పింది.
जान हैं तो जहान हैं….
योगेश को अपनी पत्नी सोनी की प्रेम कहानी का पता चला तो उसने उसकी शादी प्रेमी से ही मंदिर में करवा दी राजेश और सोनी की शादी 15 साल पहले हुई थीं अब सोनी अपने 10 साल के बेटे के साथ प्रेमी के घर चली गई मामला कानपुर देहात का है #KanourDehat @askrajeshsahu pic.twitter.com/juhcvX6ivv
— Alok Kumar /आलोक त्रिपाठी (@Aloktripath410) June 25, 2025
దీంతో, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో భర్త యోగేష్ దగ్గరుండి ఓ ఆలయంలో సోని, వికాస్లకు పెళ్లి చేశాడు. అయితే తమ వివాహ బంధానికి గుర్తుగా ఉన్న తన 12 ఏళ్ల కుమారుడిని కూడా యోగేష్ తన తల్లితో పాటు పంపించాడు. అయితే భార్య ఇష్టాన్ని గౌరవించి యోగేష్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు అంగీకరిస్తున్నా.. మరికొందరు మాత్రం తిరస్కరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..