పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి తప్పుగా మాట్లాడి, సొంత ప్రజల నుంచే ఛీత్కారాన్ని ఎదుర్కొంటున్నారు. బుద్ధి మార్చుకోవాలంటూ ఆయనకు సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకవైపు, పాకిస్తాన్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి, పాక్ ఆర్మీ చీఫ్ భారతదేశంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఖవాజా ఆసిఫ్ భారతదేశంపై విషం కక్కుతున్నారు. దీనిపై అమెరికాలోని పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ఆసిఫ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. ఖవాజా ఆసిఫ్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని పాకిస్తాన్ మంత్రుల్లో సమన్వయం లేదా అని అడిగారు.
హుస్సేన్ హక్కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఖవాజా ఆసిఫ్ పోస్ట్ను షేర్ చేస్తూ, ‘పాకిస్తాన్ కేబినెట్ మంత్రులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరా? ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, ఫీల్డ్ మార్షల్ ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ భారతదేశంతో మళ్ళీ మాట్లాడాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. మరి ఇప్పుడు, రక్షణ మంత్రి భారత ప్రధానమంత్రి గురించి అభ్యంతరకరమైన విషయాలు చెబుతున్నారు. అలాంటి భాషతో చర్చలు ఎలా ముందుకు సాగుతాయి?’ అని హుస్సేన్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై విషం కక్కినప్పుడు, పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఖవాజా ఆసిఫ్ను మందలిస్తూ, – మీరు అలాంటి భాషతో సొంత ప్రజల నుంచే ఛీత్కారం తప్పదన్నారు.

Pak Minister Khawaja Asif Comments
ఇదిలావుంటే, బుధవారం(జూన్ 25) నాడు, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కు ఫోన్ చేసి, తాను భారతదేశంతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పారు. ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POJK), సింధు జల ఒప్పందం, వాణిజ్యం వంటి అన్ని అంశాలపై మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఇంతలో, ఖవాజా ఆసిఫ్ ప్రకటన వచ్చింది. అయితే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటన కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి రావడం ఇదే మొదటిసారి కాదు.
పాకిస్తాన్ రాజకీయాల్లో ఖవాజా ఆసిఫ్ ఒక పెద్ద పేరు ఉంది. కానీ ప్రతిరోజూ ఏదో ఒక అసంబద్ధ ప్రకటన చేస్తూ తనను తాను ఇబ్బంది పెట్టుకుంటున్నాడు. గత నెలలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఒక విదేశీ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తోందని ఆయన అంగీకరించారు. పశ్చిమ దేశాల ఆదేశాల మేరకు పాకిస్తాన్ అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తోందని ఆయన అన్నారు.
ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన రాకపోయినా, పాకిస్తాన్ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న చాలా మంది పాకిస్తాన్ జర్నలిస్టులు, ప్రముఖ వ్యక్తులు అతని ప్రకటనను విమర్శించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..