ప్రముఖ నటుడు పొన్నాంబళం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతంలో పలు సార్లు ఆస్పత్రి పాలై కోలుకున్న ఆయన మరోసారి హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం పొన్నాంబళంకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సారి ఆయనకు ఏమైంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితిపై సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 1980-90వ దశకంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్ గా ఓ వెలుగు వెలిగారు పొన్నాంబళం. స్టంట్మ్యాన్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత ప్రతినాయకుడిగా మారారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో బాగా సక్సెస్ అయిన పొన్నాంబళం పర్సనల్ లైఫ్ లో మాత్రం బాగా స్ట్రగుల్ అయ్యారు. కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. అదే సమయంలో మానసిక, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులతో బాగా కుదులైపోయారు.
కొన్నేళ్ల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు పొన్నాంబళం. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి నటుడికి ఆపన్న హస్తం అందించారు. తనకు తెలిసిన వైద్యులతో మాట్లాడి పొన్నాంబళంకు సరైన చికిత్స అందేలా చూశారు. అలాగే వైద్య ఖర్చుల కోసం రూ. 50 లక్షలకు పైగా ఇచ్చారని పలు సందర్భాల్లో పొన్నాంబళమే చెప్పుకొచ్చారు. చికిత్స తర్వాత పొన్నాంబళం బాగానే కనిపించారు. ఆ మధ్యన కొన్ని సినిమా ఈవెంట్లలోనూ సందడి చేశారు. అయితే ఇప్పుడాయన మళ్లీ ఆస్పత్రిలో చేరడం సినీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పొన్నాంబళం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నా కోసం ప్రార్థించాలని సందేశం..
நடிகர் பொன்னம்பலம் உருக்கம்
உடல்நலக் குறைவால் மருத்துவமனைக்கு சென்று அறுவை சிகிச்சை முடிந்து திரும்பிய நடிகர் பொன்னம்பலம் ஆடியோ வெளியிட்டு; சினிமாவில் உள்ள பலர் தனக்கு உதவி செய்ததாகவும்; தனக்காக இறைவனிடத்தில் அனைவரும் வேண்டிக் கொள்ள வேண்டும் எனவும் கோரிக்கை..#Ponnambalam… pic.twitter.com/Emn0jfd7BJ
— Kumari Sangamam (@KumariSangamam) June 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి