Andhra Pradesh Rains: ఏపీలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడటంతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైలైట్:
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
- ఏపీలో వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ
- మరో మూడు రోజుల పాటూ వానలకు ఛాన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక
ఏలూరు జిల్లా పోలవరంలో 53.6 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 52.6, అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం 50.2, అనకాపల్లిలో 47.8, ఎన్టీఆర్ జిల్లా పాలరు బ్రిడ్జి 46.6, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 43, విశాఖపట్నం 42.6, ఏలూరు జిల్లా చింతలపూడి 40.2, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 39.6, పల్నాడు జిల్లా మాచర్లలో 38.6, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 35.2, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో 35.2, యానాంలో 35.2, కాకినా జిల్లా ప్రత్తిపాడులో 32.8, కాకినాడ జిల్లా తునిలో 31.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల విస్తరణ నెమ్మదిగా సింది. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మళ్లీ వర్షాలు ఊపందుకున్నాయి. ఆదివారం వరకు వానలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.