Andhra Pradesh Parents Teachers Mega Meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 5న పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనుంది, దీనిలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. గిరిజన గురుకుల ఉపాధ్యాయుల రెన్యువల్, పాఠశాలల నిర్వహణకు నిధుల విడుదల, బీసీ గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకుంది. ఆప్కో ఎండీగా రేఖారాణికి అదనపు బాధ్యతలు, కేవీఐబీ సీఈవోగా ఎన్.రవికుమార్ నియామకం జరిగాయి. అనంతపురంలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై మంత్రి విచారణకు ఆదేశించారు.
హైలైట్:
- ఏపీలో మరోసారి మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
- జులై 5న సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటన
- 1.49 కోట్ల మంది పేరెంట్స్, 3.32 లక్షల టీచర్స్

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. జులై 5న పక్కా, రెడీగా ఉండండి
ఆప్కో ఎండీగా రేఖారాణికి మరో కీలక బాధ్యతల్ని అప్పగించింది ప్రభుత్వం. చేనేత, జౌళి శాఖల కమిషనర్ రేఖారాణికి ఆప్కో ఎండీగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు (కేవీఐబీ) సీఈవోగా ఎన్.రవికుమార్ను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు అనంతపురం జిల్లాలో నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణంపై విచారించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, డీఐజీలను ఆదేశించారు. మంత్రి స్టాంపుల శాఖ ఉన్నతాధికారులతో ఆన్లైన్లో మాట్లాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇటీవల బయటపడిన ఈ-స్టాంపుల కుంభకోణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఈ-స్టాంపుల్ని ఎవరు సృష్టించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.