AP Govt Permission To Building For One Rupee: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణదారులకు శుభవార్త తెలిపింది. 50 చదరపు మీటర్లలోపు విస్తీర్ణంలో ఇల్లు కట్టుకునేవారికి రూపాయికే అనుమతి లభిస్తుంది. 100 చదరపు మీటర్ల లోపు స్థలంలో కట్టే ఇళ్లకు సెట్ బ్యాక్ నిబంధన తొలగించబడింది. నూతన సవరణల ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేరనుంది. అలాగే 60, 80 అడుగుల రోడ్ల పక్కన అదనపు అంతస్తులకు అనుమతి లభించనుంది.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- రూపాయికే భవనాలకు అనుమతి
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అలాగే 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకునే వాళ్లకు రూపాయి ఫీజుకే అనుమతిస్తారు. ప్రభుత్వం అంచనా ప్రకారం ఏటా 4,000 కుటుంబాలకు దాదాపు రూ.6 కోట్ల వరకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే సెట్బ్యాక్లు, రోడ్ల అంశంపై కూడా కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో పట్టణాలు, నగరాల్లో పేదలకు ఊరట దక్కింది. భవన నిర్మాణ నిబంధనలు సడలించడంతో ప్రజలకు ఈ కష్టాలు తప్పుతాయి.
ఏపీలో పేదలకు బంపరాఫర్.. వేలకు వేలు కట్టక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు.. త్వరపడండి
పక్కపక్కనే ఉన్న రెండు 60 అడుగుల రోడ్లు, రెండు 80 అడుగుల రోడ్ల దగ్గర ఎక్కువ అంతస్తులు వేసేందుకు అవకాశం వచ్చింది. 60×60 రోడ్డులో ఐదు ఫ్లోర్లు, 80×80 రోడ్డులో ఒక ఫ్లోర్ అదనంగా వేసుకోవచ్చు. ఇదివరకు అక్కడ 10 నుంచి 15 ఫ్లోర్లు వేసే వీలుండేది. ఇప్పుడు స్థిరాస్తి వ్యాపారులు 30×40, 40×40 లాంటి రోడ్ల పక్కన కూడా అదనపు ఫ్లోర్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో
కొన్ని రోడ్ల పక్కనే ఎక్కువ అంతస్తులు వేయడానికి అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనలు మారాయి. 60 అడుగుల రోడ్ల పక్కన ఐదు ఫ్లోర్లు, 80 అడుగుల రోడ్ల పక్కన ఒక ఫ్లోర్ అదనంగా వేసుకోవచ్చు. అంటే, 15 మీటర్ల వరకు అదనంగా కట్టుకోవచ్చు.