అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రపంచం నెత్తిన పిడుగు వేసింది ఇరాన్. హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇక్కడినుంచే ప్రపంచానికి 20 శాతం ముడి చమురు సరఫరా అవుతోంది.
క్రూడాయిల్, గ్యాస్ సరఫరా ఆగిపోతే.. భారత్ సహా పలు దేశాలకు తీవ్ర నష్టం. ప్రపంచంలో ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85 శాతానికి పైగా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా, ఇటీవల ముడి చమురు ధర బాగా పెరిగింది. ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది.
అదే సమయంలో భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో ఇప్పటికే ముడి చమురు నిల్వలు ఉన్నాయి. భారతదేశంలో ముడి చమురు ఎక్కడి నుండి వస్తుందంటే అస్సాం, గుజరాత్, రాజస్థాన్లలో పెద్ద మొత్తంలో ముడి చమురు నిల్వలు కనిపిస్తాయి.
ముంబై హై సీ కూడా ముడి చమురుకు పెద్ద వనరు. దక్షిణ భారతదేశంలోని కృష్ణ-గోదావరి బేసిన్లో కూడా ముడి చమురు లభిస్తుంది. భారత ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మక ముడి చమురు నిల్వలను కూడా నిర్మించింది. ఈ నిల్వలు విశాఖపట్నం, మంగళూరు, పాదూర్లలో ఉన్నాయి.