తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కోటి రూపాయల మోసం కేసును పోలీసులు గుట్టురట్టు చేశారు. 2000 నోట్ల మార్పిడి పేరుతో కోటి రూపాయలకు టోకరా వేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రెండు ఇన్నోవా కార్లలో వచ్చి నిందితులు మోసం చేశారు. బాధితుడి వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని పరారీ అయ్యారు.. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితుల అరెస్టు చేశారు పోలీసులు. భూదానం టోల్ ప్లాజా తిరుపతి దగ్గర పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. 2000 రూపాయల డమ్మీ నోట్లు, సెల్ ఫోన్లు, వైఫై రూటర్ సీజ్ చేశారు తిరుపతి జిల్లా పోలీసులు.