Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

OTT Movie: ఆ 23 మంది చావుకు కారణమెవరు? ఏపీలో సంచలనం సృష్టించిన సంఘటనపై తెరకెక్కిన రియల్ స్టోరీ.. మిస్ కావొద్దు

27 June 2025

యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్‌

27 June 2025

ధోనీ ఫ్యాన్‌ అంటూ తమన్ ను ఎద్దేవా చేసిన నెటిజన్.. ‘నీ అడ్రస్ చెప్పు..’ తమన్ మాస్ వార్నింగ్

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»America Polyethylene Company Srikakulam,ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు – american exambil interest to setup polyethylene unit srikakulam district andhra pradesh
ఆంధ్రప్రదేశ్

America Polyethylene Company Srikakulam,ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు – american exambil interest to setup polyethylene unit srikakulam district andhra pradesh

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
America Polyethylene Company Srikakulam,ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు – american exambil interest to setup polyethylene unit srikakulam district andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీ ఎగ్జాంబిల్ ఆసక్తి చూపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పాలీఇథిలిన్, పాలీప్రొపలిన్ కంపెనీని ఏర్పాటు చేయనుంది. మరోవైపు విశాఖపట్నంలో టీసీఎస్, లులూ మాల్, కాగ్నిజెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేసి 8 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు
ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.! భూములు పరిశీలించిన ప్రతినిధులు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాలీఇథిలిన్, పాలీప్రొపలిన్ కంపెనీ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికాకు చెందిన ఎగ్జాంబిల్ సంస్థ ఏపీలో పాలీఇథిలిన్, పాలీప్రొపలిన్ కంపెనీ పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కంపెనీ పెట్టేందుకు ఈ సంస్థ ఆసక్తి ప్రదర్శిస్తోంది. సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు సమీపంలో పాలీఇథిలిన్, పాలీప్రొపలిన్ కంపెనీ పెట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున ఎగ్జాంబిల్ సంస్థ ప్రతినిధులు సంతబొమ్మాలి మండలంలో పర్యటించారు. భూములను పరిశీలించారు. ఎగ్జాంబిల్ సంస్థ ప్రతినిధులతో పాటుగా టెక్కలి ఆర్డీవో ఆ ప్రాంతంలో పర్యటించారు. స్థానిక పరిస్థితులను ఎగ్జాంబిల్ సంస్థ ప్రతినిధులకు వివరించారు.

మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోని విశాఖపట్నంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు టాటా గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి స్థలం కూడా కేటాయించారు. అలాగే విశాఖకు లులు మాల్ కూడా రానుంది. రాష్ట్రంలో లులూ గ్రూప్ పెట్టుడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే విశాఖలో లులూ మాల్ ఏర్పాటుకు లులూ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తాజాగా కాగ్నిజెంట్ సంస్థ కూడా విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేసి 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది.

కాగ్నిజెంట్ సంస్థ ప్రకటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్‌ సంస్థ విశాఖలో క్యాంపస్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఉత్తరాంధ్ర ఉన్నతికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి వికేంద్రీకరణ విధానానికి ఉదాహరణ అని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

“దార్శనిక నాయకత్వం అందించేది ఇదే. మౌలిక సదుపాయాలు. పెట్టుబడి. ఉద్యోగాలు. ముఖ్యంగా – హోప్. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ప్రపంచస్థాయి క్యాంపస్ మరొక ప్రాజెక్ట్ కాదు.. ఇది నిజమైన వికేంద్రీకరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నం. రాష్ట్రం ప్రతి మూలకు అభివృద్ధిని తీసుకెళ్లాలని ఎల్లప్పుడూ విశ్వసించిన నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి ధన్యవాదాలు, ఉత్తరాంధ్ర ఇప్పుడు పురోగతి వైపు వేగంగా పయనిస్తోంది. 8వేలకు పైగా టెక్ ఉద్యోగాలు అంటే మన యువత ఇప్పుడు ఇక్కడే, వారి సొంతూరిలో, వారి కుటుంబాలకు దగ్గరగా వారి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. మార్పు ఇలా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు, ఆంధ్రప్రదేశ్ యువతకు మంచి రోజులు ఇలా ప్రారంభమవుతాయి.” అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి