వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కుప్పంలో జరిగిన ఓ ఘటన వైరల్ కాగా.. ఈ వీడియో షేర్ చేస్తూ రోజా విమర్శలు చేశారు. స్కూలు పిల్లలతో చెత్త ఎత్తిస్తున్నారంటూ రోజా ఆరోపించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం విచారకరమని.. దీనిపై ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.

*ఏపీలో తొలిసారిగా.. కేంద్ర పథకం కింద రూ.10 లక్షలు..
” ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో.. విద్యార్థుల బతుకు విలువ ఇదేనా? స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు! “చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?” అంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇది విద్యాలయమా? లేక శిక్షా శిబిరమా? నారా లోకేష్ గారు పేద పిల్లల భవిష్యత్తు దృష్టి లో పెట్జుకొని ఇప్పటికైనా విద్యాశాఖ పై దృష్టి పెట్టండి” అంటూ రోజా ట్వీట్ చేశారు.
*ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా బాబా రాందేవ్.!
మరోవైపు రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది. కుప్పం నియోజకవర్గానికి పొరుగున ఉంటుంది. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ సమస్యలను కూడా రోజా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. మరోవైపు రోజా చేసిన ట్వీట్ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదీ చూడాల్సి ఉంది. దీని వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
RK Roja: పిల్లలతో ఇలాంటి పనా? ఇది విద్యాలయమా లేక..?
*ఏపీలో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు.. ఆ ప్రాంతానికి మహర్దశ.!
రోజాపై అండతో ఇబ్బంది పెడుతున్నారు
మరోవైపు వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా అండ చూసుకుని ఓ కానిస్టేబుల్ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తిరుపతి జిల్లాకు చెందిన ఓ కుటుంబం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. రోజా అండతో మునికుమార్ అనే కానిస్టేబుల్ తనను ఇబ్బంది పెడుతున్నారని వడమాలపేట మండలం సీతాపురంలో ఉండే డి.గుణశేఖర్ ఫిర్యాదు చేశారు. తన భూమిని వారికి నచ్చిన ధరకు అమ్మటం లేదనే కోపంతో.. దొంగ రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ తయారు చేసుకుని.. అలాగే పొలానికి వెళ్లే దారికి అడ్డుపడుతున్నారని ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.