Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ENG vs IND: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. బుమ్రా ఔట్! జట్టులోకి ఎవరు రానున్నారంటే?

27 June 2025

ICC: హే క్యాహై భాయ్.! టీ20ల్లో ఇక బ్యాటర్ల దుమ్ములేపుడే.. ఊచకోత మాములుగా ఉండదు మరి

27 June 2025

West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nara Lokesh Daggubati Chenchuramaiah,కాలం మాన్చని గాయాన్ని గుర్తు చేసిన లోకేష్.. ఎవరీ దగ్గుబాటి చెంచురామయ్య..? – daggubati chenchuramaiah statue inauguration ysrcp sympathizer targets nara lokesh
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Daggubati Chenchuramaiah,కాలం మాన్చని గాయాన్ని గుర్తు చేసిన లోకేష్.. ఎవరీ దగ్గుబాటి చెంచురామయ్య..? – daggubati chenchuramaiah statue inauguration ysrcp sympathizer targets nara lokesh

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nara Lokesh Daggubati Chenchuramaiah,కాలం మాన్చని గాయాన్ని గుర్తు చేసిన లోకేష్.. ఎవరీ దగ్గుబాటి చెంచురామయ్య..? – daggubati chenchuramaiah statue inauguration ysrcp sympathizer targets nara lokesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో రాజకీయాల్లో నిత్యం ఏదో వార్త సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. బాపట్ల జిల్లాలో నారా లోకేష్ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన డీవీఆర్ సైనిక స్కూలును ప్రారంభించి.. దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహాన్ని నారా లోకేష్ ఆవిష్కరించారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే టీడీపీ అభిమానులు కూడా దీనికి బలంగా కౌంటర్ ఇస్తున్నారు.

దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్
దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో చర్చకు, రచ్చకు కారణమవుతూ ఉంటుంది. అలాంటిదే తాజాగా ఓ ఘటన జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఓ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన నారా లోకేష్.. ఓ స్కూలులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇది ఎంత వరకూ సబబంటూ వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తుండగా.. వ్యక్తిని కాదని, సందర్భం చూడాలని టీడీపీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.

అసలు విషయంలోకి వస్తే.. మంత్రి నారా లోకేష్ ఇటీవల బాపట్ల జిల్లాలో పర్యటించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో.. ఇంకొల్లు, గంగవరం రోడ్డులో కొత్తగా నిర్మించిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను నారా లోకేష్ ప్రారంభించారు. సైనిక్ స్కూల్ ప్రధాన భవనం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, బాలుర, బాలికల హాస్టల్స్, క్యాంటీన్, మెస్ భవనాలను పరిశీలించిన నారా లోకేష్.. ఆ తర్వాత డీవీఆర్ సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ అయిన హితేష్ చెంచురామ్‌తో కలిసి వాటిని ప్రారంభించారు. ఆ తర్వాత.. డీవీఆర్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య , దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను నారా లోకేష్ ఆవిష్కరించారు.

ఎవరీ దగ్గుబాటి చెంచురామయ్య..?

అయితే నారా లోకేష్ దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహావిష్కరణపై సోషల్ మీడియాలో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రే దగ్గుబాటి చెంచురామయ్య. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడుకు తోడల్లుడు. దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు.. నారా లోకేష్‌కు పెద్దమ్మ, పెదనాన్న అవుతారు. ఆ రకంగా దగ్గుబాటి చెంచురామయ్య.. నారా లోకేష్‌కు తాత అవుతారు. ఈ క్రమంలోనే పెద్దమ్మ, పెదనాన్న విజ్ఞప్తి మేరకు నారా లోకేష్ దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహావిష్కరణ, స్కూలు ప్రారంభానికి వచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. చదువు ప్రాముఖ్యతను, తల్లిదండ్రులు, గురువులు, సైనికుల పట్ల గౌరవాన్ని వివరించారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించారు. చదువుకు ఉన్న శక్తేంటో తెలుసుకుని దగ్గుబాటి చెంచురామయ్య 1980ల్లోనే విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని కొనియాడారు. అప్పట్లోనే ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలు స్థాపించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారని అన్నారు. దగ్గుబాటి చెంచురామయ్య వారసత్వాన్ని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన పిల్లలు కొనసాగిస్తున్నారని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే దగ్గుబాటి కుటుంబం పనిచేస్తోందని నారా లోకేష్ ప్రశంసించారు.

ఎందుకీ రచ్చ?

అయితే దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహాన్ని నారా లోకేష్ ఆవిష్కరించడంపై కొన్ని వర్గాలు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నాయి. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఈ అంశం ఆధారంగా చేసుకుని.. నారా లోకేష్‌ను ట్రోల్ చేస్తున్నాయి. కారంచేడు ఘటనలో దళితుల మరణానికి కారణమైన వ్యక్తి విగ్రహాన్ని నారా లోకేష్ ఆవిష్కరించడం ఎంత మేరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నాయి.

కారంచేడు ఘటన

1985 జూలై 17న కారంచేడులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో ఓ వర్గం.. మరో వర్గం మీద జరిపిన దాడిలో ఆరుగురు చనిపోయారు. ముగ్గురు మహిళలపై అఘాయిత్యం జరిగింది. నీటికోసం మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి.. హత్యలకు కారణమైంది. ఈ ఘటన అప్పట్లో రాష్టవ్యాప్తంగా సంచలనం రేపింది. కారంచేడు ఘటనపై 2008 డిసెంబర్ 19న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అప్పటికే నిందితుల్లో చాలా మంది చనిపోయారు. దీంతో మిగిలిన వారిలో ప్రధాన నిందితుడైన అంజయ్యకు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. మరో 29 మందికి 3 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే నారా లోకేష్ చేతుల మీదుగా దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహావిష్కరణతో ఈ విషయం సోషల్ మీడియాలో మరోసారి చర్చకు కారణమైంది.

అయితే నారా లోకేష్ .చెంచురామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భం, ప్రదేశం వేరని టీడీపీ అభిమానులు చెప్తున్నారు. ఆ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి కోసం దగ్గుబాటి కుటుంబం సైనిక స్కూల్‌ను ఏర్పాటు చేశారని.. స్కూలు ప్రారంభోత్సవానికి వచ్చిన నారా లోకేష్.. స్కూలు ఆవరణలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి అయిన దగ్గుబాటి చెంచురామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారని చెప్తున్నారు. దీనిని వేరుగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అలాగే దగ్గుబాటి చెంచురామయ్య తనయుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. కొంతకాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అంటూ టీడీపీ అభిమానులు.. వైసీపీ మద్దతుదారులను ప్రశ్నిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి