Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra: ఆడుకుందామని పొద్దున్నే గ్రౌండ్‌కి వెళ్లిన పిల్లలు – కనిపించింది చూసి షాక్

28 June 2025

Andhra News: రైతులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి డబ్బులు!

28 June 2025

Astrology: ఈ రాశులవారు అసూయపరులు.. వీరితో జర భద్రం..

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Gottipati Ravi Kumar On Cut Power Charges,ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు – andhra pradesh minister gottipati ravi kumar comments on cut power charges
ఆంధ్రప్రదేశ్

Gottipati Ravi Kumar On Cut Power Charges,ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు – andhra pradesh minister gottipati ravi kumar comments on cut power charges

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gottipati Ravi Kumar On Cut Power Charges,ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు – andhra pradesh minister gottipati ravi kumar comments on cut power charges
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Cut Power Charges: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విశాఖలో నూతనంగా నిర్మించిన సూపర్ ఈసీబీసీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. తండాలు, గూడేలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలో రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు.

హైలైట్:

  • ఏపీలో విద్యుత్ ఛార్జీలపై మంత్రి గొట్టిపాటి
  • ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాము
  • విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు
విద్యుత్ ఛార్జీలపై మంత్రి గొట్టిపాటి
విద్యుత్ ఛార్జీలపై మంత్రి గొట్టిపాటి (ఫోటోలు– Samayam Telugu)

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని మంత్రి ర‌వికుమార్ ప్రారంభించారు. విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాలతో విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. విద్యుత్ ఉద్యోగుల శిక్షణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నం దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా నిలుస్తుంద‌ని ఆకాంక్షించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన ఈ భ‌వ‌నం ద్వారా సుమారు 40 శాతంపైగా విద్యుత్ ఆదా అవుతుండ‌టం ఆద‌ర్శప్రాయమ‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నామ‌న్నారు.’విద్యుత్ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబాలు ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా వీలైనంత తక్కువ రోజుల్లోనే నియామక పత్రాలు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 నెలల్లో సుమారు 180 మందికి నియామక పత్రాలు అందజేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూట‌మి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక ఉదాహ‌ర‌ణ. విద్యుత్ శాఖ‌లో విధినిర్వహణలో లైన్‌మెన్ లు వంటి కింద‌ స్థాయి సిబ్బంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండ‌టం బాధాక‌ర‌ం. మంత్రి ప్రమాదాల్లో మ‌ర‌ణించిన వారికి కూట‌మి ప్రభుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంది’ అన్నారు గొట్టిపాటి.

‘స్వాతంత్య్రం వ‌చ్చిన 75 సంవ‌త్సరాలు దాటిన తరువాత కూడా ఇంత వ‌ర‌కు విద్యుత్ సౌక‌ర్యం లేని.. తండాలు, చెంచు గూడేల‌కు రూ.120 కోట్లు వ్యయంతో విద్యుత్ అందించాము. అదే విధంగా విద్యుత్ స్తంభాలు, లైన్లు వేయ‌లేని టైగ‌ర్ రిజ‌ర్వ్ ప్రాంతాల్లోని నివాసితుల‌కు కూడా సోల‌ర్ ప్యానెల్స్, బ్యాట‌రీ స్టోరేజ్ ప‌ద్ధతుల‌లో నిరంత‌ర విద్యుత్ ను అందిస్తున్నామ‌ు. ఇది కూట‌మి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజ‌లంద‌రికీ గ‌ర్వకార‌ణ‌ం’ అన్నారు.

ఏపీలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

‘విద్యుత్ శాఖ‌కు సంబంధించి ప్రజ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అనేక‌ చ‌ర్యలు చేప‌డుతున్నామ‌ు. 24 గంట‌లూ నాణ్యమైన గ్రీన్ ఎన‌ర్జీని ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల‌కు అందించే ల‌క్ష్యంతో ముందుకెళ్తున్నాము. కేంద్ర ప్రభుత్వ స‌హ‌కారంతో 20 ల‌క్షల సోలార్ విద్యుత్ క‌నెక్షన్లను ఇవ్వడానికి ప్రయ‌త్నిస్తున్నాము. ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నీసం 10 వేల సోలార్ విద్యుత్ క‌నెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాము. సోలార్ క‌నెక్షన్లను వేగ‌వంతం చేసే క్రమంలో ఎదుర‌య్యే ఇబ్బందులను అధిగ‌మించేందుకు స్థానిక సోలార్ త‌యారీదారుల‌ను ప్రోత్సహిస్తున్నాము. అదే విధంగా పీఎం కుసుమ్ ప‌థ‌కంలో భాగంగా… వ‌చ్చే వ్యవ‌సాయ సీజ‌న్ నాటికి.. రైతుల‌కు ప‌గ‌టి పూటే 9 గంట‌ల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తాము. రాష్ట్రంలోని మూడు ల‌క్షల వ్యవ‌సాయ పంపు సెట్లకు సోలార్ క‌నెక్షన్లను అనుసంధానించే ప్రక్రియ వేగ‌వంతం చేశాము’ అన్నారు మంత్రి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి