ఈ నెల 12న అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషంలోపే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 270 మంది మరణించారు. అయితే.. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఎయిర్ ఇండియాకు అనుబంధం సంస్థగా ఉన్న AISATSలో సెలబ్రేషన్స్ జరిగినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. AISATS సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఒక ఆఫీస్ పార్టీలో డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ఫుటేజ్ బయటకు రావడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. దీంతో నలుగురు సీనియర్ AISATS ఉద్యోగులను రాజీనామా చేయాలని ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ కోరినట్లు సమాచారం.
వైరల్ అవుతున్న వీడియో AISATS గురుగ్రామ్ కార్యాలయంలో రికార్డ్ చేసినట్లు సమాచారం. కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా సిబ్బందితో కలిసి నృత్యం చేస్తుండగా, నేపథ్యంలో ఉల్లాసమైన సంగీతం వినిపిస్తోంది. ఈ వేడుకల సమయాన్ని విస్తృతంగా ఖండించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు ఇప్పటికీ తమ ప్రియమైనవారి మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ కంపెనీ ఉద్యోగులు ఇలా పార్టీలు చేసుకోవడం, అది కూడా కంపెనీ ఆఫీస్లోనే కావడంతో పలువురు తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ సెలబ్రేషన్స్ దేని కోసం జరిగాయనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
AISATS అంటే ఏమిటి?
ఎయిర్ ఇండియా SATS (AISATS) అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్, సింగపూర్కు చెందిన SATS లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్. ఇది భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలను అందిస్తుంది. ఏవియేషన్ లాజిస్టిక్స్లో ఫ్రంట్లైన్ ప్లేయర్గా, ఎయిర్ ఇండియా విమానాల సేవలను నిర్వహించడంలో కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది.
It has only been a few days since the tragic Ahmedabad plane crash.
Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over.
Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD
— Squint Neon (@TheSquind) June 22, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి