Fake Items Look Like As Branded In Anantapur: అనంతపురం జిల్లాలో నకిలీ వస్తువుల గుట్టు రట్టయింది. బ్రాండెడ్ లోగోలతో నకిలీ షాంపూలు, సబ్బులు, ఇతర నిత్యావసర వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్న హోల్సేల్ వ్యాపారుల బాగోతం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో నకిలీ వస్తువులు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో ఈ నకిలీ వస్తువులు తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నమ్మకమైన షాపుల్లోనే వస్తువులు కొనాలని అధికారులు సూచిస్తున్నారు.
హైలైట్:
- అనంతపుర జిల్లాలో కొత్త దందా మొదలు
- బ్రాండెడ్ వస్తువులు అనుకుంటే అంతే
- అమ్మో జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతి

ఈ వస్తువులపై ISI ముద్రతో పాటు బార్ కోడ్ను గమనించి దానిని స్కాన్ చేశారు.. అయినా సరే ఆ వస్తువు నకిలీదని తెలియలేదు.. దీంతో అధికారులు అవాక్కయ్యారు. నకిలీ వస్తువులు అని తెలియకుండా పక్కాగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ వస్తువుల్ని ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి చూస్తే కానీ అవి నకిలీవని తెలియలేదు. ఈ ఫేక్ వస్తువుల్ని అనంతపురం జిల్లాకు పొరుగున ఉన్న కర్ణాటకలో తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా డీలర్లను నియమించుకుని ఆయా జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని వస్తువులు కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంటుందని.. నకిలీ వస్తువులపై బ్రాండ్, డిజైన్, ప్యాకింగ్ స్టైల్ తేడాగా ఉంటుందని.. ఈ విషయాన్ని గమనించి వస్తువుల్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అందుకే నమ్మకం ఉన్న షాపుల్లో మాత్రం వస్తువుల్ని కొనుగోలు చేయాలని.. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సో బీ కేర్ఫుల్.. ఏదైనా వస్తువును కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అధికారులు.