Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Indian Railways: ఏళ్ల నాటి వ్యవస్థ మారనుంది..? రైలు ప్రమాదాలను తగ్గించేందుకు కొత్త టెక్నాలజీ!

28 June 2025

Cloud Coffee: రోజుని క్లౌడ్ కాఫీతో మొదలు పెట్టండి? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..! రెసిపీ ఏమిటంటే..

28 June 2025

Banana: షాకింగ్ పరిశోధన.. బీపీ నియంత్రణకు కొత్త టెక్నిక్.. ఉప్పు కాదు.. అరటిపండే ముఖ్యం

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Anantapur Seized Fake Items Look Like As Branded,సబ్బులు, షాంపులు, టూత్ పేస్ట్‌లు వంటి వస్తువులు కొంటున్నారా.. బీ కేర్‌ఫుల్, ఈ విషయం తెలుసుకోండి – vigilance officials seized fake items look like as branded in shops at anantapur district
ఆంధ్రప్రదేశ్

Anantapur Seized Fake Items Look Like As Branded,సబ్బులు, షాంపులు, టూత్ పేస్ట్‌లు వంటి వస్తువులు కొంటున్నారా.. బీ కేర్‌ఫుల్, ఈ విషయం తెలుసుకోండి – vigilance officials seized fake items look like as branded in shops at anantapur district

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Anantapur Seized Fake Items Look Like As Branded,సబ్బులు, షాంపులు, టూత్ పేస్ట్‌లు వంటి వస్తువులు కొంటున్నారా.. బీ కేర్‌ఫుల్, ఈ విషయం తెలుసుకోండి – vigilance officials seized fake items look like as branded in shops at anantapur district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Fake Items Look Like As Branded In Anantapur: అనంతపురం జిల్లాలో నకిలీ వస్తువుల గుట్టు రట్టయింది. బ్రాండెడ్ లోగోలతో నకిలీ షాంపూలు, సబ్బులు, ఇతర నిత్యావసర వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్న హోల్‌సేల్ వ్యాపారుల బాగోతం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో నకిలీ వస్తువులు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో ఈ నకిలీ వస్తువులు తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నమ్మకమైన షాపుల్లోనే వస్తువులు కొనాలని అధికారులు సూచిస్తున్నారు.

హైలైట్:

  • అనంతపుర జిల్లాలో కొత్త దందా మొదలు
  • బ్రాండెడ్ వస్తువులు అనుకుంటే అంతే
  • అమ్మో జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతి
అనంతపురం నకిలీ వస్తువులు స్వాధీనం
అనంతపురం నకిలీ వస్తువులు స్వాధీనం (ఫోటోలు– Samayam Telugu)

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు ఉంది పరిస్థితి.. బ్రాండెడ్ లోగోలతో నకిలీ వస్తువుల్ని తయారు చేసి మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. ప్రతి రోజూ ఉపయోగించే షాంపూలు, సబ్బులు, వాషింగ్ పౌడర్లు, ఆల్ అవుట్, టీ, కాఫీ పొడులు, సబ్బులు, బిస్కెట్లు, వంట నూనె, టూత్‌పేస్టులు, ఫినాయిల్ వంటి వస్తువుల్ని జనాలకు అంటగడుతున్నారు. పెద్ద, పెద్ద బ్రాండ్ల వస్తువుల్లాగే నకిలీవి తయారు చేసి అమ్ముతున్నారు. లోగో, ISI మార్క్, ప్యాకింగ్, బార్‌ కోడ్‌లు సేమ్ టు సేమ్ ఒరిజనల్ బ్రాండ్ వస్తువుల్లానే గే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒరిజనల్ ఏదో, ఫేక్ ఏదో కూడా తెలుసుకోలేని విధంగా వీటిని తయారు చేసి మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ నకిలీ వస్తువల బండారం బయటపడింది.కొందరు కేటుగాళ్లు.. హోల్‌సేల్ వ్యాపారులు బ్రాండెడ్ పేరుతో నకిలీ వస్తువులు తయారు చేసి అమ్మేస్తున్నారు. హోల్‌సేల్‌గా అమ్ముతున్నట్లు బిల్డప్ ఇస్తూ అసలు ధర కంటే 10 శాతం తక్కువకే ఇస్తామని జనాల్ని ఆకర్షిస్తున్నారు. ఈ వస్తువుల్ని హోల్‌సేల్ వ్యాపారుల నుంచి కొందరు కిరాణా షాపుల నిర్వాహకులు కూడా ఈ నకిలీ వస్తువులను కొనుగోలు చేసి జనాలకు అమ్మేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు అనంతపురం, గుంతకల్లు ప్రాంతాల్లోని కొన్ని హోల్‌సేల్ షాపుల్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఈ ఫేక్ వస్తువుల గుట్టు బయటకొచ్చింది. ఈ మేరకు ఆ షాపుల్లో చాలా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వస్తువులపై ISI ముద్రతో పాటు బార్‌ కోడ్‌‌ను గమనించి దానిని స్కాన్ చేశారు.. అయినా సరే ఆ వస్తువు నకిలీదని తెలియలేదు.. దీంతో అధికారులు అవాక్కయ్యారు. నకిలీ వస్తువులు అని తెలియకుండా పక్కాగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ వస్తువుల్ని ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి చూస్తే కానీ అవి నకిలీవని తెలియలేదు. ఈ ఫేక్ వస్తువుల్ని అనంతపురం జిల్లాకు పొరుగున ఉన్న కర్ణాటకలో తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా డీలర్లను నియమించుకుని ఆయా జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని వస్తువులు కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంటుందని.. నకిలీ వస్తువులపై బ్రాండ్, డిజైన్, ప్యాకింగ్ స్టైల్ తేడాగా ఉంటుందని.. ఈ విషయాన్ని గమనించి వస్తువుల్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అందుకే నమ్మకం ఉన్న షాపుల్లో మాత్రం వస్తువుల్ని కొనుగోలు చేయాలని.. ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సో బీ కేర్‌ఫుల్.. ఏదైనా వస్తువును కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అధికారులు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి