Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Indian Railways: ఏళ్ల నాటి వ్యవస్థ మారనుంది..? రైలు ప్రమాదాలను తగ్గించేందుకు కొత్త టెక్నాలజీ!

28 June 2025

Cloud Coffee: రోజుని క్లౌడ్ కాఫీతో మొదలు పెట్టండి? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..! రెసిపీ ఏమిటంటే..

28 June 2025

Banana: షాకింగ్ పరిశోధన.. బీపీ నియంత్రణకు కొత్త టెక్నిక్.. ఉప్పు కాదు.. అరటిపండే ముఖ్యం

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Heavy Weekend Rush,తిరుమలలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా.. రెండు వారాల్లోనే సీన్ మొత్తం మారింది, ఏమైందంటే – tirumala darshan heavy rush due to weekend after almost two weeks
ఆంధ్రప్రదేశ్

Tirumala Heavy Weekend Rush,తిరుమలలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా.. రెండు వారాల్లోనే సీన్ మొత్తం మారింది, ఏమైందంటే – tirumala darshan heavy rush due to weekend after almost two weeks

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Heavy Weekend Rush,తిరుమలలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా.. రెండు వారాల్లోనే సీన్ మొత్తం మారింది, ఏమైందంటే – tirumala darshan heavy rush due to weekend after almost two weeks
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Darshan Heavy Rush: తిరుమలలో వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది, అలిపిరి వద్ద వాహనాలు బారులు తీరాయి. ఘాట్ రోడ్డు మరమ్మతుల కారణంగా నెమ్మదిగా సాగుతున్నాయి. శ్రీనివాసమంగాపురంలో జూన్ 30 నుండి జులై 2 వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగుతాయి. జులై నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. జులై 6 నుండి 9 వరకు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జరుగుతాయి.

హైలైట్:

  • తిరుమలలో చాలా రోజుల తర్వాత
  • రెండు వారాల తర్వాత మారిన సీన్
  • సోమవారం వరకు అదే పరిస్థితి
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ (ఫోటోలు– Samayam Telugu)

తిరుమలలో చాలా రోజుల తర్వాత మళ్లీ పరిస్థితి మారిపోయింది.. దాదాపు రెండు, మూడు వారాల తర్వాత మళ్లీ కొండపై భక్తుల రద్దీ కనిపించింది. వీకెండ్ కావడంతో భక్తులు, వాహనాల రద్దీగా ఉంది.. అలిపిరి దగ్గర శనివారం ఉదయం నుంచి భారీగా వాహనాల రద్దీ పెరిగింది. వాహనాలు భారీగా ఉండటంతో చెక్‌పోస్ట్ దగ్గర తనిఖీలు ఆలస్యమవుతున్నాయి. ఈ మేరకు అలిపిరి దగ్గర గరుడ కూడలి వరకు వాహనాలు బారులు తీరి కనిపించింది. అలాగే రెండో ఘాట్ రోడ్డులో ప్రస్తుతం టీటీడీ మరమ్మతు పనులు చేపట్టింది.. దీంతో ఆ రూట్‌లో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రెండు వారాల క్రితం వరకు తిరుమలలో భక్తుల రద్దీ కనిపించింది. మళ్లీ ఈ వారం భక్తులు కొండకు పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లలో మరమ్మతుల కారణంగా వాహనాలు నిధానంగా వెళుతున్నాయి. అందుకే టీటీడీ అలర్ట్ చేసింది.. తిరుమలకు వచ్చే భక్తులు ఒక గంట ముందే బయల్దేరాలని సూచిస్తోంది. ఘాట్ రోడ్లలో మరమ్మతుల పనులు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా రావాలని కూడా అలర్ట్ చేశారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జులై 02 తేదీ వరకు మూడు రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించేందుకు స‌ర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఆల‌యంలో ప్ర‌త్యేకంగా విద్యుత్, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. వాహ‌న‌సేవ‌ల కోసం పెద్ద‌శేష‌, హ‌నుమంత‌, గ‌రుడ వాహ‌నాల‌ను సిద్ధం చేశారు.మొదటి రోజు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండో రోజు జులై 01వ తేదీ హనుమంత వాహనంపై, మూడో రోజు జూలై 02వ తేదీ గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. జులై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జూన్ 30వ తేదీ నుండి జులై 03వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, తిరుప్పావడ సేవ, జులై 01వ తేదీ స్వర్ణపుష్పార్చన, జూలై 02వ తేదీ అష్టోత్తర శతకలశాభిషేకం సేవలను రద్దు చేశారు.

తిరుమలలో చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా.. రెండు వారాల్లోనే సీన్ మొత్తం మారింది, ఏమైందంటే

శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

జులై నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. జులై 05, 12, 19, 26 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయంలో ఊంజల్ సేవ జరుగనుంది. జులై 10వ తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగనున్నారు. జులై 16న ఆణివార ఆస్థానం.. జులై 20 – 22 వరకు పవిత్రోత్సవాలు, జులై 19న అంకురార్పణ. జులై 24న పునర్వసు నక్షత్రం మరియు అమావాస్య సందర్భంగా ఉ. 7.00 గం.లకు సహస్రకలశాభిషేకం, ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. జులై 06 – 09వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి