ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9000 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన కార్యక్రమంలో 500 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చేతుల మీదుగా విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్ నియోజకవర్గాలలోని మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు అందజేశారు.

ఈ నేపథ్యంలోనే మెప్మాలోని రిసోర్స్ పర్సన్స్కు ఏపీ ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేస్తోంది. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలోని మెప్మా రిసోర్స్ పర్సన్స్కు శనివారం ట్యాబ్లు పంపిణి చేశారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో 500 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేశినేని చిన్ని.. మెప్మా, డ్వాక్రా.. సీఎం నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని అభివర్ణించారు. మెప్మా రిసోర్స్ పర్సన్స్కు ట్యాబ్లు అందిస్తున్నామని.. అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ మెప్మా, డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.
అటు అనంతపురం జిల్లా రాయదుర్గంలోనూ మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చేతుల మీదుగా మెప్మా రిసోర్స్ పర్సన్స్, డిజి లక్ష్మిలకు ట్యాబ్లు, బయోమెట్రిక్ డివైజ్లు అందజేశారు. నూతన టెక్నాలజీ ద్వారా మెప్మా రిసోర్స్ పర్సన్లు , డిజి లక్ష్మిలు ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కోరారు.
మెప్మా రిసోర్స్ పర్సన్స్ స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బుక్ కీపింగ్, ఇతర నైపుణ్య శిక్షణలను అందిస్తారు. బ్యాంకు లింకేజీల ద్వారా రుణం మంజూరయ్యేలా చూడటం, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం వీరి పని. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయటంలోనూ రిసోర్స్ పర్సన్స్ సాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు సాంకేతికతను చేరువ చేసేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9000 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యా్బ్లు అందించనున్నట్లు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.