Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Loans: బంగారు రుణాల వల్ల క్రెడిట్ స్కోర్‌ పెరుగుతుందా?

28 June 2025

WTC 2025-27: భారత జట్టుకు ఊహించని షాకిచ్చిన ఆసీస్.. ఆ రేసు నుంచి ఔట్..?

28 June 2025

ఛీ.. ఛీ.. వీడసలు మనిషేనా.! ఫ్రంట్ సీట్ ఇవ్వలేదని ఏకంగా తండ్రినే..

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Government Tabs Distribution,ఏపీలో వారందరికీ ట్యాబ్‌లు.. విజయవాడలో 500 మందికి పంపిణీ.. – ap government provides tabs to mepma resource persons
ఆంధ్రప్రదేశ్

Ap Government Tabs Distribution,ఏపీలో వారందరికీ ట్యాబ్‌లు.. విజయవాడలో 500 మందికి పంపిణీ.. – ap government provides tabs to mepma resource persons

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Government Tabs Distribution,ఏపీలో వారందరికీ ట్యాబ్‌లు.. విజయవాడలో 500 మందికి పంపిణీ.. – ap government provides tabs to mepma resource persons
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9000 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన కార్యక్రమంలో 500 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చేతుల మీదుగా విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్ నియోజకవర్గాలలోని మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు అందజేశారు.

ఏపీలో వారందరికీ ట్యాబ్‌లు.. విజయవాడలో 500 మందికి పంపిణీ..
ఏపీలో వారందరికీ ట్యాబ్‌లు.. విజయవాడలో 500 మందికి పంపిణీ.. (ఫోటోలు– Samayam Telugu)

మహిళల సంక్షేమానికి, సాధికారతకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాలు (SHG) సభ్యులైన మహిళలకు రుణాలు అందిస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలతో పాటుగా స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల సాధికారతను ప్రోత్సహించేందుకు 2007లో మెప్మాను స్థాపించారు. MEPMA (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్) పేరుతో పట్టణ ప్రాంతాల్లోని మహిళల సాధికారత కోసం మెప్మా ఏర్పాటు చేశారు. మెప్మాలో రిసోర్స్ పర్సన్స్ చాలా కీలకంగా ఉంటారు.

ఈ నేపథ్యంలోనే మెప్మాలోని రిసోర్స్ పర్సన్స్‌కు ఏపీ ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేస్తోంది. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలోని మెప్మా రిసోర్స్ పర్సన్స్‌కు శనివారం ట్యాబ్‌లు పంపిణి చేశారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో 500 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేశినేని చిన్ని.. మెప్మా, డ్వాక్రా.. సీఎం నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని అభివర్ణించారు. మెప్మా రిసోర్స్ పర్సన్స్‌కు ట్యాబ్‌లు అందిస్తున్నామని.. అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ మెప్మా, డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.

అటు అనంతపురం జిల్లా రాయదుర్గంలోనూ మెప్మా రిసోర్స్ పర్సన్‌లకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చేతుల మీదుగా మెప్మా రిసోర్స్ పర్సన్స్, డిజి లక్ష్మిలకు ట్యాబ్‌లు, బయోమెట్రిక్ డివైజ్‌లు అందజేశారు. నూతన టెక్నాలజీ ద్వారా మెప్మా రిసోర్స్ పర్సన్లు , డిజి లక్ష్మిలు ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కోరారు.

మెప్మా రిసోర్స్ పర్సన్స్ స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బుక్ కీపింగ్, ఇతర నైపుణ్య శిక్షణలను అందిస్తారు. బ్యాంకు లింకేజీల ద్వారా రుణం మంజూరయ్యేలా చూడటం, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం వీరి పని. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయటంలోనూ రిసోర్స్ పర్సన్స్ సాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు సాంకేతికతను చేరువ చేసేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9000 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యా్బ్‌లు అందించనున్నట్లు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి