Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మినిమమ్ డిగ్రీ చెయ్యాలి మావ..! ఈ గ్యాంగ్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఎక్కడవుందో కనిపెట్టండి

28 June 2025

Veg Mayonnaise Sandwich Recipe: పిల్లలకు ఎంతగానో నచ్చే క్రీమీ టేస్ట్, సింపుల్ రెసిపీ మీకోసం..!

28 June 2025

Shower Peeing: షవర్ యూరినేషన్ అంటే ఏంటి.. ఈ అలవాటు మీకుంటే ఈ డేంజర్ తప్పదు..

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Current Bill,ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. మరో రెండు రోజులే, త్వరపడండి.. – apcpdcl voluntary additional load scheme offer ends by june 30
ఆంధ్రప్రదేశ్

Ap Current Bill,ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. మరో రెండు రోజులే, త్వరపడండి.. – apcpdcl voluntary additional load scheme offer ends by june 30

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Current Bill,ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. మరో రెండు రోజులే, త్వరపడండి.. – apcpdcl voluntary additional load scheme offer ends by june 30
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విద్యుత్ వినియోగదారుల కోసం ఏపీసీపీడీసీఎల్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 శాతం రాయితీతో అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. మార్చి ఒకటి నుంచి ఏపీసీపీడీసీఎల్ తమ విద్యుత్ వినియోగదారులకు ఈ అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. జూన్ 30తో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు.

హైలైట్:

  • విద్యుత్ వినియోగదారులకు అలర్ట్
  • అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు ముగుస్తున్న గడువు
  • జూన్ 30వ తేదీతో ముగియనున్న గడువు
ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. మరో రెండు రోజులే, త్వరపడండి..
ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. మరో రెండు రోజులే, త్వరపడండి.. (ఫోటోలు– Samayam Telugu)

ఏపీలో కరెంట్ వినియోగదారులకు ముఖ్య గమనిక. గృహ విద్యుత్ వినియోగదారుల కోసం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కల్పించిన అద్భుత అవకాశం మరో రెండు రోజుల్లో ముగియనుంది. విద్యుత్ అదనపు లోక్ క్రమబద్ధీకరణకు ఏపీసీపీడీసీఎల్ జూన్ 30వ తేదీ వరకూ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ అవకాశం కల్పించగా.. ఈ గడువు జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గృహ విద్యుత్ వినియోగదారులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు 50 శాతం రాయితీతో విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకునేందుకు ఏపీసీపీడీసీఎల్ జూన్ 30 వరకూ గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా గృహ విద్యుత్ వినియోగదారులు కిలోవాట్‌ లోడ్‌ విద్యుత్ క్రమబద్ధీకరణ 2 వేల రూపాయలు వరకూ చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వచ్ఛందంగా విద్యుత్ క్రమబద్ధీకరణకు ముందుకు వచ్చేవారికి కిలోవాట్‌కు 50 శాతం రాయితీ ఇస్తున్నారు. దీంతో 2 వేలకు బదులుగా రూ.1000 కడితే సరిపోతుంది. ఏపీసీపీడీసీఎల్ మార్చి 1 నుంచి ఈ అవకాశం కల్పించింది. గడువు ముగిసేందుకు ఇంకో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో త్వరపడాలని అధికారులు చెప్తున్నారు.

మరోవైపు ఏపీసీపీడీసీఎల్ పథకానికి వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లాలో విద్యుత్ వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ లోడ్‌ను క్రమబద్ధీకరించుకున్నారు. దీంతో సంస్థకు కూడా భారీగా ఆదాయం సమకూరింది. మరోవైపు పీఎం సూర్యఘర్ పథకం కింద విద్యుత్ వినియోగించుకునే వారికి 3.5 కిలోవాట్ల లోడ్ కనీస లోడ్‌‌గా ఉండాలి. అలా లేని పక్షంలో పీఎం సూర్యఘర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత.. కిలోవాట్‌ విద్యుత్‌కు 2000 చెల్లించాల్సి ఉంటుంది. అదే దరఖాస్తు చేయడానికి ముందుగానే వినియోగదారులు అదనపు లోడ్‌ క్రమబద్ధీకరించుకుంటే కిలోవాట్‌‌కు వేయి కడితే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు.

ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. మరో రెండు రోజులే, త్వరపడండి..

విజయవాడలో ఏపీసీపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఉంది. బాపట్ల, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో ఏపీసీపీడీసీఎల్ సేవలను అందిస్తుంది. గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ సరఫరా చేస్తుంది. ఈ క్రమంలోనే గృహ విద్యుత్ వినియోగదారుల కోసం ఏపీసీపీడీసీఎల్ ఈ ఆఫర్ తెచ్చింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి