విద్యుత్ వినియోగదారుల కోసం ఏపీసీపీడీసీఎల్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 శాతం రాయితీతో అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. మార్చి ఒకటి నుంచి ఏపీసీపీడీసీఎల్ తమ విద్యుత్ వినియోగదారులకు ఈ అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. జూన్ 30తో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు.
హైలైట్:
- విద్యుత్ వినియోగదారులకు అలర్ట్
- అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు ముగుస్తున్న గడువు
- జూన్ 30వ తేదీతో ముగియనున్న గడువు

మరోవైపు ఏపీసీపీడీసీఎల్ పథకానికి వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ లోడ్ను క్రమబద్ధీకరించుకున్నారు. దీంతో సంస్థకు కూడా భారీగా ఆదాయం సమకూరింది. మరోవైపు పీఎం సూర్యఘర్ పథకం కింద విద్యుత్ వినియోగించుకునే వారికి 3.5 కిలోవాట్ల లోడ్ కనీస లోడ్గా ఉండాలి. అలా లేని పక్షంలో పీఎం సూర్యఘర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత.. కిలోవాట్ విద్యుత్కు 2000 చెల్లించాల్సి ఉంటుంది. అదే దరఖాస్తు చేయడానికి ముందుగానే వినియోగదారులు అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకుంటే కిలోవాట్కు వేయి కడితే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు.
ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. మరో రెండు రోజులే, త్వరపడండి..
విజయవాడలో ఏపీసీపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఉంది. బాపట్ల, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో ఏపీసీపీడీసీఎల్ సేవలను అందిస్తుంది. గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ సరఫరా చేస్తుంది. ఈ క్రమంలోనే గృహ విద్యుత్ వినియోగదారుల కోసం ఏపీసీపీడీసీఎల్ ఈ ఆఫర్ తెచ్చింది.