
మేడ్చల్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం శనివారం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును.. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు వ్యక్తులు శివ(19), భాను(22) బైక్పై వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు అప్రమత్తత కారణంగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.