APCPDCL Waives ACD Charges: కరెంట్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ శుభవార్త చెప్పింది. తక్కువ కరెంట్ వాడేవారికి, పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు ఏసీడీ ఛార్జీలు రద్దు చేసింది. పీఎం సూర్కఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లు బిగించుకున్నవారితో పాటుగా.. తక్కువ కరెంట్ వినియోగం ఉన్న కుటుంబాలతోనూ ఏసీడీ ఛార్జీలు వసూలు చేయడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

500 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారిని తక్కువ కరెంట్ ఉపయోగించే వినియోగదారులుగా.. 500 కంటే ఎక్కువ యూనిట్లు ఉపయోగిస్తే ఎక్కువ విద్యుత్ ఉపయోగించే వారిగా విద్యుత్ సిబ్బంది పరిగణిస్తారు. అయితే ఎక్కువ కరెంట్ వాడే వారితో పాటుగా.. తక్కువగా కరెంట్ ఉపయోగించేవారు, పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్నవారితోనూ ఏసీడీ ఛార్జీలు వసూలు చేశారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో 500 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ ఉపయోగించేవారు, సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ ఛార్జీలను రద్దు చేసింది.
APCPDCL: విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ ఛార్జీలు రద్దు..
అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్.. అంటే
విద్యుత్ వినియోగదారుల వార్షిక వినియోగంలో 2 నెలల బిల్లు మొత్తాన్ని అధికారులు లెక్కిస్తారు. ఆ మొత్తాన్ని సదరు విద్యుత్ సంస్థ వినియోగదారుడి నుంచి వసూలు చేసి తమ వద్ద డిపాజిట్గా పెట్టుకుంటుంది. దానినే ఏసీడీ అంటారు. ఈ డిపాజిట్పై వచ్చే వడ్డీని.. వినియోగదారుల ఏప్రిల్ కరెంట్ బిల్లులో తగ్గిస్తారు. అయితే 500 యూనిట్లలోపు కరెంట్ వాడే కుటుంబాలతో పాటుగా. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటి మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలతోనూ ఈ ఏసీడీ ఛార్జీలు వసూలు చేయటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అదికారులు ఈ ఛార్జీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.