Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025

Sadhguru Wisdom: పాములు శివలింగాన్ని చుట్టుకుని ఉంటాయెందుకు.. సద్గురు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం!

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Ration Card Kandipappu,ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.! – andhra pradesh ration card holders no supply of kandipappu even in july
ఆంధ్రప్రదేశ్

Ap Ration Card Kandipappu,ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.! – andhra pradesh ration card holders no supply of kandipappu even in july

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Ration Card Kandipappu,ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.! – andhra pradesh ration card holders no supply of kandipappu even in july
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఓ బ్యాడ్ న్యూస్.. జులై నెలలో కూడా కందిపప్పు సరఫరా లేనట్లు తెలిసింది. మార్చి నెల నుంచి ఏపీలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా ఆగిపోయింది. అయితే జులై నెలలో అయినా కందిపప్పు సరఫరా ఉంటుందని రేషన్ కార్డుదారులుు ఆశించారు. అయితే జులై నెలలో కూడా రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా లేనట్లు సమాచారం. మరోవైపు వృద్ధులు, దివ్యాంగులకు ఇప్పటికే ఇంటి వద్దనే రేషన్ సరుకుల డెలివరీ జరుగుతోంది.

ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.!
ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.! (ఫోటోలు– Samayam Telugu)

ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్. వచ్చే నెలలోనూ రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా కనిపించడం లేదు.2025 మార్చి నెల నుంచి ఏపీలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. జులై నెలలోనూ కందిపప్పు అందేలా కనిపించడం లేదు. మార్కె్ట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.160 వరకూ పలుకుతోంది. నాణ్యతను అనుసరించి కందిపప్పు రేటు ఉంది. కందిపప్పు రేటు మండిపోతూ ఉండటంతో సామాన్యుడికి కొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందించే కందిపప్పు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి నెల నుంచి ఏపీలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయడం నిలిచిపోయింది.
జులై నెల నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం, చక్కెరతో పాటుగా రాగులు, కందిపప్పు కూడా అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. అయితే అమలుకు మాత్రం నోచుకోలేదు. జులై నెలకు సంబంధించి నిత్యావసరాలు ఇప్పటికే చేరుకోగా.. ఈసారి కూడా కందిపప్పు సరఫరా లేదని అధికారులు చెప్తున్నారు. రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.67లకే పంపిణీ చేస్తారు. అదే మార్కెట్లో అయితే కనీసం రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు సరఫరా లేదని తెలిసి సామాన్య ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా కందిపప్పు అందించాలని కోరుతున్నారు.

ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.!

ఐదు రోజుల ముందే రేషన్ సరుకులు

మరోవైపు ఏపీలో వృద్ధులు, దివ్యాంగులకు జులై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అప్పుడే మొదలైపోయింది. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారాలు సహా రేషన్ షాపులు రెండు పూటలా అందుబాటులో ఉంచాలని రేషన్ డీలర్లను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే దివ్యాంగులు, వృద్ధులకు మాత్రం ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేస్తామని తెలిపింది. అందులో భాగంగా ఒకటో తేదీకి ఐదు రోజుల ముందే వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే రేషన్ సరఫరా చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెలా 26 నుంచే రేషన్ సరుకులను ఇంటి వద్ద పంపిణీ చేయనున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి