Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»ఇక ఏపీ నగరాల దశ తిరిగినట్టే..! కేంద్ర నిధుల ప్రవాహంతో కొత్త శకం ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్

ఇక ఏపీ నగరాల దశ తిరిగినట్టే..! కేంద్ర నిధుల ప్రవాహంతో కొత్త శకం ప్రారంభం!

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఇక ఏపీ నగరాల దశ తిరిగినట్టే..! కేంద్ర నిధుల ప్రవాహంతో కొత్త శకం ప్రారంభం!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌లో నగరాల అభివృద్ధికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, స్పష్టత నగర పాలనకు కొత్త ప్రాణం పోస్తోంది. తాజాగా ఆయన ఉండవల్లి నివాసంలో మంత్రి నారాయణతోపాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలు, మున్సిపాలిటీలపై పెట్టుబడుల పరంపర ఏపీ పట్టణాల భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తున్నాయి.

చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కలిగి, డబుల్ ఇంజిన్ సర్కార్‌గా ఉండడం వల్ల అనేక ప్రాజెక్టులకు నిధులు వరదలా వచ్చిపడుతున్నాయి. తాజాగా AIIB – ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుంచి రూ. 5,800 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రూ. 3,000 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరు అయ్యాయి. అయితే గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో ఈ నిధుల విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు సీఎం అయిన తర్వాత అనేక విధుల సమస్యలను పరిష్కరించి, అదే ప్రాజెక్టులకే మళ్లీ నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారు.

అమృత్ స్కీమ్ ద్వారా తాగునీటి పైప్‌లైన్ పనుల కోసం తాజాగా టెండర్లు పిలవడం జరిగింది. వీటితో 85 శాతం ఇళ్లకు నేరుగా నదులు, కాలువల ద్వారా నీరు అందేలా ప్రణాళిక. AIIB నిధులతో రూ. 5,350 కోట్ల పనులకు వారం రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. 2029 నాటికి అన్ని పట్టణాల్లో 100% STP (శుద్ధి చేసిన నీటి ప్లాంట్లు) ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. డ్రైన్లలో బాగా శుద్ధి చేసిన నీటినే వదిలేలా చర్యలు తీసుకుంటామన్నారు.

గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన పేరుకుపోయిన చెత్త తొలగింపును అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరు, విశాఖలో ఇప్పటికే 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ తయారీ జరుగుతోంది. నెల్లూరు, రాజమండ్రి ప్లాంట్లకు టెండర్లు పూర్తయ్యాయి. కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో ప్లాంట్లకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ ప్లాంట్లు పూర్తయితే రోజుకు 7500 టన్నుల చెత్త విద్యుత్ ఉత్పత్తికి వాడబడుతుంది. మిగతా 500 టన్నుల చెత్తను ఇతర పద్ధతుల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంపాక్టర్లు, స్వీపింగ్ మెషీన్ల కొనుగోలుకు రూ. 225 కోట్లు కేటాయించడం జరిగింది. మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తున్నారు.

గతంలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది పట్టణాల్లో నివాస సమస్యకు స్థిర పరిష్కారంగా మారనుంది. త్వరలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి త్వరలో తగిన నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

Raymond Group Investments In Ap,ఏపీలోని ఆ రెండు జిల్లాలకు పండగలాంటి వార్త..! – raymond group investments 1200 crore in anantapur in andhra pradesh

28 June 2025

AP News: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కీలక అప్డేట్ వచ్చేసిందోచ్..

28 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. మూడు దశలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల కోసం…

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025

Sadhguru Wisdom: పాములు శివలింగాన్ని చుట్టుకుని ఉంటాయెందుకు.. సద్గురు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం!

28 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.