Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Free Bus Scheme For Women,ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు కీలక సూచనలు.. – andhra pradesh cm chandrababu review on free bus travel scheme for women from august 15
ఆంధ్రప్రదేశ్

Ap Free Bus Scheme For Women,ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు కీలక సూచనలు.. – andhra pradesh cm chandrababu review on free bus travel scheme for women from august 15

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Free Bus Scheme For Women,ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు కీలక సూచనలు.. – andhra pradesh cm chandrababu review on free bus travel scheme for women from august 15
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Free bus Travel Scheme For Women: ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. ఆగస్ట్ 15 నుంచి ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై శనివారం అధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం అమలుకు ఎన్ని బస్సులు అవసరం అవుతాయి.. ఎంతమంది మహిళలు ప్రయాణిస్తారనే వివరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు కీలక సూచనలు..
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు కీలక సూచనలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా ఒక్కొక్క హామీ అమలు చేస్తూ వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో హామీ అమలుపై కసరత్తు ప్రారంభించింది. ఆగస్ట్ 15 నుంచి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈ విషయంపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు.

*ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరుగుతుందని.. అందుకు తగినట్లుగా బస్సులు సంఖ్య పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇందుకోసం అవసరమైతే కొత్త బస్సులు కొనడం, లేదా అద్దెకు తీసుకోవడం చేయాలని సూచించారు. అలాగే ఇక మీదట ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులు అన్నీ కూడా.. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడున్న బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతీ ఆర్టీసీ బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని సూచించారు.

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ప్రజాధనం సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతీ రూపాయి విలువైనదేనని అన్నారు. ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని.. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పెంచుకోవాలనే దానిపై ఆలోచనలు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

*విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆ ఛార్జీలు రద్దు..

బస్టాండ్లలో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచాలని.. ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై ప్రయాణికుల్లో సంతృఫ్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు బస్సుల కొనుగోలు గురించి కూడా చంద్రబాబు కీలక సూచనలు చేశారు. డీజిల్, ఎలక్ట్రికల్ వెహికల్, సీఎన్‌జీ, బ్యాటరీ స్వైపింగ్.. ఏ బస్సు కొనుగోలు చేసేందుకు, నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందనే ప్రతిపాదనలు రూపొందించాలని చంద్రబాబు సూచించారు.

*ఏపీలో వారందరికీ ట్యాబ్‌లు.. విజయవాడలో 500 మందికి పంపిణీ..

మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలంటే ఏపీఎస్ఆర్టీసీకి మరో 2,536 బస్సులు అదనంగా అవసరం అవుతాయని.. రవాణా శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఇందుకోసం రూ.996 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఏపీ జనాభా 5.25 కోట్లు అయితే.. మహిళలు 2.62 కోట్ల మంది ఉన్నారు. ఇక పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో ఏటా 43.06 కోట్ల సార్లు మహిళలు ప్రయాణిస్తారని అదికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఈ సంఖ్య 75.51 కోట్లకు చేరుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు.

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు కీలక సూచనలు..

ఇక ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల విషయానికి వస్తే మహిళల ప్రయాణాల సంఖ్య ఏటా 6.85 కోట్లుగా ఉంది. పథకం అమలు చేస్తే ఈ సంఖ్య 13.39 కోట్లకు చేరుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే.. ఏడాదిలో 88.90 కోట్ల సార్లు మహిళలు ప్రయాణించే వీలుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆక్యుపెన్సీకి తగిన విధంగా బస్సులు సమకూర్చుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి