కుషానులు, మగధ, శుంగ వంశాల కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. తవ్వకాల్లో మట్టి స్తంభాల నివాస గృహాలు, పొరలు పొరలుగా ఉన్న గోడల కందకాలు, కొలనులు, వివిధ ఇనుప రాగి వస్తువులు బయటపడ్డాయి. సూక్ష్మ శిలా పరికరాలు, హోల్ సీన్ పూర్వకాలం నుంచే ఇక్కడ మానవ వునికిని సూచిస్తున్నాయి. క్రీస్తు పూర్వం వెయ్యి కాలానికి చెందిన 15 యజ్ఞకుండాలు, శక్తి ఆరాధన మొక్కుబడి చెరువులు, శివపార్వతుల మట్టి విగ్రహాలు ఆధ్యాత్మిక జీవనానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మీలిపి అక్షరాలున్న నాలుగు కాల్చిన ముద్రికలు లభించాయి. ఇవి భారత ఉపఖండంలో బ్రాహ్మీలిపికి సంబంధించిన అత్యంత పురాతన కాలాన్ని నిర్ధారించడానికి ఆధారాలు కావచ్చు అని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మహాజనపదాల కాలం నాటి యజ్ఞకుండాలలో అక్షరాలు లేని రాగి నాణేలు దొరకడం నాణేల ఆవిర్భావ చరిత్రపై కొత్త వెలుగునిచ్చే అవకాశం ఉంది. ఎముకల పనిముట్లు, విలువైన రాళ్లు, శంఖగాజులు ఆనాటి హస్తకళా నైపుణ్యాన్ని చాటుతున్నాయి. ఈ తవ్వకాలు భారతదేశ చరిత్రలోనే కీలక అధ్యాయాలను తెరకెక్కించగలవని వినయ్గుప్తా పేర్కొన్నారు. ఈ స్థల పరిరక్షణకు ఏఎస్ఐ సంస్కృతిక మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.
మరిన్ని వీడియోల కోసం :