ఈ మార్గంలో పాములు రాకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, పాములు వస్తే పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్నీ రంగంలోకి దించారు. అయితే, ఆ రోజు ఎలాంటి పాములూ కనిపించలేదు. అయితే, తాజాగా ఆ ఈవెంట్ కోసం బీచ్ మార్గంలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ల తరలింపు వేళ.. సాగర్ నగర్ వద్ద గల ఓ గుంతలో ఈ భారీ రక్తపింజరి కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్స్ దానిని ఓ సీసాలో బంధించి.. సమీపంలోని కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్లో వదిలేశారు. మన దేశంలో గల అత్యంత విషపూరితమైన పాముల్లో రక్త పింజరి ఒకటి. ఇది కాటు వేసిన వెంటనే క్షణాల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. దీన్ని కాటుక రేకుల పాము అని కూడా అంటారు. మనదేశంలో అత్యధిక పాము కాటు మరణాలకు కారణమైన నాలుగు విష సర్పాల్లో ఇదొకటి.
మరిన్ని వీడియోల కోసం :