ఈ వివరాలను ఆలయ ప్రధాన పూజారి కబీంద్ర ప్రసాద్ శర్మ మీడియాకు తెలిపార. ఇంతకీ ఆలయం తలుపులను ఎందుకు మూసివేస్తారు. అనుకుంటున్నారా ? ఏటా జూన్ – జులై మధ్యకాలంలోనే గువహటిలో అంబూబాచీ మేళా జరుగుతుంటుంది. ఈ సమయంలోనే ఎందుకు అంటే యావత్ విశ్వ సృష్టికి కామాఖ్య మాతే కారకం అని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారిని యావత్ విశ్వానికే మాతగా భావిస్తారు. ఈ సమయంలోనే పుడమి తల్లికి రుతుచక్రపు దశ మొదలవుతుందని నమ్ముతారు. ఈ కారణం వల్లే జూన్, జులై నెలల్లో వ్యవసాయ కార్యక్రమాలకు భూమి అత్యంత అనువుగా ఉంటుందని అంటారు. పుడమి తల్లి రుతుచక్రపు దశలో ఉండే పరమ పవిత్రమైన రోజుల్లో జూన్ 22 నుంచి 26 వరకు ప్రత్యేక పూజలతో కామాఖ్య మాతను ప్రసన్నం చేసుకోవచ్చు అనేది భక్తుల విశ్వాసం. అందుకే అంబూబాచీ మేళాకు పెద్దఎత్తున భక్తజనం తరలి వస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం :