Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

‘బీహార్ తదుపరి ముఖ్యమంత్రి వారే..’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు!

28 June 2025

ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

28 June 2025

‘చనిపోయిన నా కొడుకు వీర్యాన్ని ఇప్పించండి’.. హైకోర్టును ఆశ్రయించిన ఓ తల్లి!

28 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Raymond Group Investments In Ap,ఏపీలోని ఆ రెండు జిల్లాలకు పండగలాంటి వార్త..! – raymond group investments 1200 crore in anantapur in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Raymond Group Investments In Ap,ఏపీలోని ఆ రెండు జిల్లాలకు పండగలాంటి వార్త..! – raymond group investments 1200 crore in anantapur in andhra pradesh

.By .28 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Raymond Group Investments In Ap,ఏపీలోని ఆ రెండు జిల్లాలకు పండగలాంటి వార్త..! – raymond group investments 1200 crore in anantapur in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Raymond Group investments in Anantapur: ఏపీకి పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి చర్యలతో ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు రేమండ్ గ్రూప్ ముందుకు వచ్చింది. గార్మెంట్, ఆటో మొబైల్ విడిభాగాలు, ఏరో స్పేస్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. రేమండ్ గ్రూప్ రూ.1,201.95 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో రేమండ్ గ్రూప్‌నకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అనంతపురంలో రేమండ్ గ్రూప్ పెట్టుబడులు
అనంతపురంలో రేమండ్ గ్రూప్ పెట్టుబడులు

ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, లులు గ్రూప్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రేమండ్ గ్రూప్ తెరపైకి వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ, ఏరోస్పేస్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. రాప్తాడు వద్ద గార్మెంట్, గుడిపల్లి వద్ద ఆటోమొబైల్ విడిభాగాల తయారీ, టేకులోడు దగ్గర ఏరోస్పేస్‌ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలే రేమండ్ గ్రూప్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రేమండ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,201.95 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రేమండ్ గ్రూప్ పెట్టుబడుల ద్వారా సుమారుగా 6,571 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక రాప్తాడు వద్ద ఏర్పాటు చేసే గార్మెంట్‌ యూనిట్‌ కోసం 26.87 ఎకరాలను రేమండ్ గ్రూప్‌కు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఎకరా రూ.20 లక్షల చొప్పున భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే టేకులోడు దగ్గర ఏర్పాటు చేసే ఆటో మొబైల్ విడిభాగాల తయారీ యూనిట్ కోసం రేమండ్ సంస్థకు 29.52 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఎకరా రూ.37.72 లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వం కేటాయించింది. గుడిపల్లి వద్ద ఏర్పాటు చేసే ఏరోస్పేస్ తయారీ యూనిట్ కోసం రేమండ్ గ్రూప్‌కు ఏపీ ప్రభుత్వం 24.39 ఎకరాలను కేటాయించింది. ఎకరా రూ.45.95 లక్షలకు చొప్పున కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్ పెట్టుబడులతో గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఈ ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి వల్ల స్థానికులకు ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు అనంతపురం జిల్లాలో గిన్‌ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు కూడా ఏపీ ప్రభుత్వం ఆనుమతి ఇచ్చింది.

తిమ్మసముద్రంలో గిన్‌ఫ్రా ప్రెసిషన్స్‌ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. రూ.1,150 కోట్లతో గిన్‌ఫ్రా ప్రెసిషన్స్‌ సంస్థ బైమాడ్యులర్‌ ఛార్జ్‌ సిస్టమ్స్‌ తయారీ యూనిట్‌ నెలకొల్పనుంది. ఈ తయారీ యూనిట్ కోసం తిమ్మసముద్రంలో ఎకరం రూ.8.30లక్షల చొప్పున ఏపీ ప్రభుత్వం 121.53 ఎకరాలను గిన్‌ఫ్రా ప్రెసిషన్స్‌ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు అనుమతులు కూడా మంజూరు చేసింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి