Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తండ్రి అంత్యక్రియలకు రాకుండా అడ్డుకున్న గ్రామస్తులు.. కారణం తెలిస్తే..

29 June 2025

అరంగేట్రంలోనే దడ పుట్టించిన 8 మంది భారత బౌలర్లు.. వన్డేల్లో వీళ్లు యమ కింకరులే భయ్యో..

29 June 2025

బైక్‌ కొంటున్నారా.. అయితే ఇకపై రెండు హెల్మెట్లు కొనాల్సిందే! కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్‌ ఇవే..

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kakinada Missing Girl Found Request Pawan Kalyan,పవన్ అన్నా కాపాడంటూ అభ్యర్థన.. 48 గంటల్లోనే బాలిక మిస్సింగ్‌ కేసును చేధించిన పోలీసులు – kakinada missing girl found whose parents request pawan kalyan
ఆంధ్రప్రదేశ్

Kakinada Missing Girl Found Request Pawan Kalyan,పవన్ అన్నా కాపాడంటూ అభ్యర్థన.. 48 గంటల్లోనే బాలిక మిస్సింగ్‌ కేసును చేధించిన పోలీసులు – kakinada missing girl found whose parents request pawan kalyan

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kakinada Missing Girl Found Request Pawan Kalyan,పవన్ అన్నా కాపాడంటూ అభ్యర్థన.. 48 గంటల్లోనే బాలిక మిస్సింగ్‌ కేసును చేధించిన పోలీసులు – kakinada missing girl found whose parents request pawan kalyan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తమ కుమార్తె కనిపించకుండా పోయిందని ఓ కుటుంబం పవన్ కళ్యాణ్ ను వేడుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 20 రోజుల నుండి కనిపించకుండా పోయిన బాలిక కేసును పోలీసులు 48 గంటల్లో చేధించారు. డిప్యూటీ సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిరసన తెలిపితేనే స్పందిస్తారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడ బాలిక మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
కాకినాడ బాలిక మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు (ఫోటోలు– Samayam Telugu)

రెండు రోజుల క్రితం తమ కుమార్తె కనిపించకుండా పోయింది.. సాయం చేయ్ పవన్ అన్నా అంటూ ఓ కుటుంబం అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 48 గంటల్లోగా బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. బాలిక ఆచూకీ గుర్తించారు పోలీసులు. బాలిక మిస్ అయ్యి 20 రోజులు అయింది. పోలీసులుకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రుల.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో.. తమ కుమార్తెను కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో బాలిక మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పైగా పవన్ దృష్టికి చేరిన 48 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న జనాలు.. నిరసన తెలిపితే గాని పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. బాధిత మార్వాడి కుటుంబం సుమారు 18 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కరప గ్రామానికి వచ్చి సెటిల్ అయ్యారు. వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే జూన్ 8వ తారీఖున తమ పద్నాలుగేళ్ల కుమార్తె కనపించకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసి రెండు వారాలపైనే అవుతున్నా తమ బిడ్డ ఆచూకీ గుర్తించలేదు.

దీంతో విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు.. తమ కుమార్తను కాపాడమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం కోరారు. ఆయనను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ కాకినాడకు వస్తున్నారని తెలుసుకుని తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం ముందుగా .. విమానాశ్రయం వద్ద, ఆ తర్వాత సభలో కూడా ప్లకార్డులను ప్రదర్శించి.. తమకు సాయం చేయాలని కోరారు. ‘పవన్ అన్నా మా బిడ్డ కనిపించడం లేదు.. 20 రోజులవుతున్నా మాకు ఇంకా న్యాయం జరగలేదు.. సాయం చేయన్నా’ అంటూ వేడుకున్నారు.

తమ బిడ్డ కనిపించకుండా పోయినప్పటి నుంచి.. తమ పక్కింట్లో ఉండే 23 ఏళ్ల యువకుడు కూడా కనిపించడం లేదని.. తమకు అతడిపైనే అనుమానంగా ఉందని తెలిపారు. పోలీసులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని.. కనీసం డిప్యూటీ సీఎంను కూడా కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు వారి నిరసన ఫలించి 48 గంటల్లోనే వారి బిడ్డ ఆచూకీని గుర్తించారు పోలీసులు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి