Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Simran: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన యువతి.. ఫ్లైట్‌ దిగిన కాసేపటికే..

29 June 2025

Paneer: వాళ్ల పా’పాలు’ – మనకు శా’పాలు’

29 June 2025

అంబేద్కర్ రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. ఏడాది తర్వాత ఇంటికి చేరిన కేతిరెడ్డి అరెస్ట్ – andhra pradesh anantapur tension in tadipatri former mla kethireddy pedda reddy detained
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. ఏడాది తర్వాత ఇంటికి చేరిన కేతిరెడ్డి అరెస్ట్ – andhra pradesh anantapur tension in tadipatri former mla kethireddy pedda reddy detained

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. ఏడాది తర్వాత ఇంటికి చేరిన కేతిరెడ్డి అరెస్ట్ – andhra pradesh anantapur tension in tadipatri former mla kethireddy pedda reddy detained
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు కారణం కేతిరెడ్డి రాక. దీంతో పోలీసులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాది తర్వాత ఆయన తిరిగి రావడంతో జేసీ వర్గీయులు వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో ఆయన ఇంటికి వెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా కేతిరెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారు. ఎన్నికల సమయంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..

హైలైట్:

  • తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్
  • తాడిపత్రి నివాసంలో ప్రత్యక్షమైన కేతిరెడ్డి
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాడిపత్రిలో టెన్షన్
తాడిపత్రిలో టెన్షన్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉత్కంఠకర పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు సంవత్సరం తర్వాత.. కేతిరెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదిలా ఉండగానే కేతిరెడ్డి రాక గురించి తెలుసుకున్న జేసీ వర్గీయులు ఆయన తాడిపత్రి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేతిరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తన అనుచరులతో కలిసి పెద్దారెడ్డి ఇంటికి బయలు దేరారు. మరోవైపు కేతిరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి వద్దకు చేరుకున్నారు. కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిణామాలు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేతిరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని అనంతపురం తీసుకెళ్లారు.

కేతిరెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది. అయితే న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో.. కొన్నిరోజుల క్రితమే ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే కేతిరెడ్డి తన ఇంటికి రావడంతో తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రిలోని ఆయన నివాసంలోనే కేతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అనంతపురం తరలిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను విజయం సాధించినా లేక ఓడిపోయినా సరే.. తాడిపత్రిలో మాత్రం ఫ్యాక్షనిజం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే టీడీపీ నేతలు గత కొంత కాలంగా కేతిరెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిలో భాగంగానే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డిని తాడిపత్రికి రానివ్వబోనని గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై కేతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఇక న్యాయస్థానం ఆదేశాల మేరకే తాను తన నివాసానికి వచ్చానని.. కొద్ది సేపటికే పోలీసులు తనను అదుపులోకి తీసకున్నారని కేతిరెడ్డి తెలిపారు. ఇక ఆదివారం నాడు ఆయన తన నివాసంలో ప్రత్యక్ష్యం కావడంతో.. తాడిపత్రిలో పొలిటికల్ టెన్షన్ రాజుకుంది. పోలీసులు తాడిపత్రి పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడటం కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి