ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామంలో మొసలి కలకలం సృష్టించింది. అకస్మాత్తుగా ఓ డ్రైనేజీలో మొసలి కనిపిచండంతో స్థానికులు భయాందోళన చెందారు. ఊర్లో ఉన్న డ్రైనేజీలో ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తే గ్రామస్తులు దగ్గరికెళ్లి చూశాడు.. తీరా చూస్తే అది మొసలి అని తెలిసి భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామానికి కొద్ది దూరంలో బల్లకట్టువాగు ప్రవాహం ఉండటంతో ఆ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పంచాయతీ, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఆ మొసలిని పట్టుకుని పాలెంవాగు మధ్య తరహా జలాశయంలో వదిలి పెట్టారు. దీంతో ఊరంతా ఊపిరి పీల్చుకున్నారు.