ఉత్తరాఖండ్లోని బార్కోట్-యమునోత్రి రోడ్డులోని సిలై బ్యాండ్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా అక్కడ నిర్మాణంలో ఉన్న హోటల్ కూలిపోయింది. ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 8 నుండి 9 మంది కార్మికులు నీటిలో కొట్టుకుపోయారు. తప్పిపోయిన కార్మికుల కోసం వెతకడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఉత్తరకాశి డిఎం ప్రశాంత్ ఆర్య వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ యమునోత్రి రహదారి కూడా ఈ విపత్తు వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన కార్మికుల కోసం రెస్క్యూ టీం గాలిస్తున్నట్టుగా వెల్లడించారు.
ఉత్తరకాశిలోని సలై బ్యాండ్ ప్రాంతంలోని ఒక కార్మిక శిబిరం ఈ విపత్తులో చిక్కుకుంది. మొత్తం 19 మంది కార్మికులు శిబిరంలో నివసిస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది కార్మికులను సురక్షితంగా రక్షించగా, 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పారు. వారికోసం విస్తృతంగా గాలిస్తున్నట్టుగా చెప్పారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి…
#WATCH | Uttarkashi, Uttarakhand | 8-9 workers staying at an under-construction hotel site went missing after the construction site was damaged due to a cloud burst in Silai Band on Barkot-Yamunotri Marg. Yamunotri Marg has also been affected: Uttarkashi DM Prashant Arya
Rescue… pic.twitter.com/k6FiyZCdCa
— ANI (@ANI) June 29, 2025
ఉత్తరాఖండ్లో రుతుపవనాల రాక వేడి నుండి ఉపశమనం కలిగించింది. అయితే ఇలాంటి మేఘాల విస్ఫోటనం కారణంగా చాలా మంది కనిపించకుండా పోయారు. వాతావరణ శాఖ ప్రకారం, జూన్ 29న హరిద్వార్, నైనిటాల్, తెహ్రీ, పౌరి, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.. అదే సమయంలో, బాగేశ్వర్లో ఆరెంజ్ అలర్ట్, ఉత్తరకాశీ, అల్మోరాలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడ్డాయి. ఈ సమయంలో మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని, నదుల నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని అనేక చోట్ల నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ప్రమాదం పెరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..