Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Income Tax: రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. వీరికి నోటీసులు పంపుతోంది.. ఎందుకో తెలుసా?

29 June 2025

Tirumala Car Fire Accident,తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు.. – fire breaks out in car at gnc toll gate in tirumala

29 June 2025

New CM: మరో మూడు నెలల్లో కొత్తం సీఎం..?.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Duvvada Vani Said Will Do Hunger Strike,ఆమరణ దీక్ష చేస్తా.. దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు.. కారణమిదే! – srikakulam tekkali zptc duvvada vani said will do hunger strike for this reason
ఆంధ్రప్రదేశ్

Duvvada Vani Said Will Do Hunger Strike,ఆమరణ దీక్ష చేస్తా.. దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు.. కారణమిదే! – srikakulam tekkali zptc duvvada vani said will do hunger strike for this reason

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Duvvada Vani Said Will Do Hunger Strike,ఆమరణ దీక్ష చేస్తా.. దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు.. కారణమిదే! – srikakulam tekkali zptc duvvada vani said will do hunger strike for this reason
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కొన్నాళ్ల క్రితం దువ్వాడ కుటుంబం పేరు మారుమోగింది. ఇప్పుడు దువ్వాడ వాణి టెక్కలి సమస్యలపై ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. సర్పంచ్‌లను తొలగించడం, ఉపాధి హామీ సిబ్బందిని తొలగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, అధికారులు స్పందించే వరకు దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆమె దీక్షకు దిగడానికి అసలు కారణం ఏంటి.. అరు వివరాలు తెలియాలంటే..

హైలైట్:

  • దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు
  • ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటన
  • కారణమిదే
దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు
దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు (ఫోటోలు– Samayam Telugu)

కొన్నాళ్ల క్రితం వరకు కూడా దువ్వాడ కుటుంబం పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. దువ్వాడ శ్రీనివాస్, మాధురిల వ్యవహారం.. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వివాదం సద్దుమణిగనప్పటికీ.. దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమరణ దీక్ష చేస్తానంటూ దువ్వాడ వాణి సంచలన ప్రకటన చేశారు. మరి ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. టెక్కలి మండలం సమస్యలు, సర్పంచ్‌ల తొలగింపు వంటి అంశాలపై స్పందిస్తూ టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్కలి మండలంతో పాటుగా చాలా చోట్ల సర్పంచ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. వారు ఎలాంటి తప్పులు చేయకపోయినా సరే.. అధికారులు వారి చెక్‌పవర్‌ రద్దు చేస్తున్నారని దువ్వాడ వాణి ఆరోపించారు. అంతేకాక ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలిగిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాజకీయ పార్టీలు, నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోవద్దని కోరారు. మళ్లీ జగనన్న ప్రభుత్వమే వస్తుందని.. అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని దువ్వాడ వాణి తెలిపారు.

టెక్కలి మేజర్‌ పంచాయతీలో పారిశుద్ధ్యం దారుణంగా ఉందని.. మౌలిక వసతుల నిర్వహణ దిగజారిపోయిందని దువ్వాడ వాణి తెలిపారు. అధికారులు ఈ నిర్లక్ష్యం వీడేంతవరకు టెక్కలిలో ఆమరణ దీక్ష చేపడతానని దువ్వాడ వాణి ప్రకటించారు. పంచాయతీ, మండల పరిషత్‌ నిధులను వాటికి కేటాయించిన ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. టెక్కలిలో 196 హుదూద్‌ ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు కల్పించాలని దువ్వాడ వాణి కోరారు. ఈ సమస్యలు పరిష్కరించకపోత తాను ఆమరణ దీక్ష చేస్తానంటూ వాణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

భార్యాభర్తలుగా, వైసీపీ లీడర్లుగా దువ్వాడ శ్రీనివాస్‌, వాణిలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంచి క్రేజ్ ఉండేది. రాజకీయాలపరంగా చూసుకుంటే ఇద్దరూ సీనియర్ నాయకులే. ఇద్దరికీ పాలిటిక్స్‌లో అనుభవం ఉంది. దువ్వాడ వాణి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా కూాడా పనిచేశారు. ప్రస్తుతం టెక్కలి జెడ్పీటీసీగా ఉన్నారు. ఆమెది రాజకీయ కుటంబం.

ఆమరణ దీక్ష చేస్తా.. దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు.. కారణమిదే!

భర్తతో విబేధాలు ముగిసిన తర్వాత.. ప్రస్తుతం దువ్వాడ వాణి వైసీపీలో కీలక నాయకురాలిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఆమెకు సముచితమైన గౌరవం దక్కుతుంది అంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ యాక్టీవ్‌గా ఉంటున్నారు. వైసీపీ తరఫున టెక్కలిలో చురుగ్గా పని చేస్తున్నారు. అవకాశం అదృష్టం కలిసి వస్తే.. వచ్చే ఎన్నికల్లో దువ్వాడ వాణి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారట. దీనిలో భాగంగానే నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలుస్తోంది.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి