జపాన్లో రాజకుటుంబం ఇప్పటికీ ఉంది. వారు తమ పూర్వీకులు అనుసరిస్తున్న విధంగానే తమ సంప్రదాయాలను నేటీకి పాటిస్తున్నారు. ఈ రాజకుటుంబ యువరాణులు వారి సాధారణ జీవితం కారణంగా ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. జపాన్ రాజకుటుంబానికి చెందిన ఒక యువరాణి వీడియో ఈ రోజుల్లో వైరల్ అవుతోంది. కాకో అకిషానో అనే జపాన్ రాజకుటుంబానికి చెందిన యువరాణి ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఈ వీడియోలో యువరాణి కాకో దేశీయ విమానంలో సాధారణ ప్రయాణీకురాలిలా ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.
జపాన్ యువరాణి కాకో బ్రెజిల్ పర్యటనలో ఉన్నారు. బ్రెజిల్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు బ్రెజిల్లోని ఎనిమిది నగరాలకు 11 రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో, ఆమె దేశీయ విమానంలో ప్రయాణించి ఎకానమీ క్లాస్ సీటులో కూర్చుని కనిపించింది. ఆమె ప్రయాణిస్తున్నప్పుడు నిద్రపోతూ కిటికీకి ఆనుకుని ఉంది. ఈ సమయంలో ఆమె వీడియో వైరల్ అవుతోంది. యువరాణి ప్రయాణంలో ఆడంబరం, ఎటువంటి అట్టహాసం లేకుండా కనిపించింది. ఆమె తన అధికారులతో కలిసి సాధారణ ప్రయాణీకురాలిగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
🇯🇵🇧🇷
It has been on viral for #Japan’s Princess Kako of Akishino who made her official visit to #Brazil. The Princess was seen travelling in a commercial flight from São Paulo to Campo Grande. She was among her followers and other passengers in the flight.… pic.twitter.com/jHyryqbUm8— Royal World Thailand 🇹🇭 (@rwthofficial) June 18, 2025
యువరాణి కాకో అత్యంత సాదాసీదాగా కనిపించిన ప్రవర్తన రాజకుటుంబ సభ్యురాలిగా ఉన్నప్పటికీ ఆమె జీవితం ఎంత సరళంగా ఉందో చూపిస్తుంది. 30 ఏళ్ల యువరాణి కాకో చక్రవర్తి నరుహిటో మేనకోడలు, జపాన్ రాజకుటుంబంలో ముఖ్యమైన సభ్యురాలు. ఆమె తమ్ముడు, ప్రిన్స్ హిసాహిటో, సింహాసనం కోసం తదుపరి పోటీదారుడు. ఎందుకంటే జపాన్లో మహిళలు ఇప్పటికీ రాజ వారసత్వాన్ని కోల్పోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..