Free Bus Pass for Students in Andhra Pradesh: విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పాసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి వరకూ బాలికలకు, ఆరో తరగతి వరకూ బాలురకు ఉచితంగా బస్సు పాసులు అందిస్తున్నారు. ఆపైన నిర్ణీత రుసుంతో బస్సు పాసులను ఏపీఎస్ఆర్టీసీ మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో బస్ పాస్ ఎలా పొందాలనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

అలాగే ఇంటర్మీడియట్ చదివే బాలికలు, ఏడో తరగతి నుంచి బాలురు బస్ పాసుల కోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దూరాన్ని అనుసరించి ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక విశాఖపట్నం సంగతికి వస్తే.. ప్రతి విద్యార్థికి మూడు నెలలకు ఓసారి బస్ పాస్ మంజూరు చేస్తారు. రూ.935 చెల్లిస్తే, మూడు నెలలు విశాఖలోని సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణించేలా బస్ పాస్ ఇస్తారు. మూడు నెలల తర్వాత మళ్లీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్ ఉన్న విద్యార్థులు మెట్రో బస్సులలో ప్రయాణించాలంటే రూ.10 చెల్లించి కాంబినేషన్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం
మరోవైపు విశాఖపట్నంలో విద్యార్థుల కోసం రూట్ పాస్లు కూడా మంజూరు చేస్తున్నారు. 4 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలు సాగించే విద్యార్థులకు ఈ రూట్పాస్లు అందిస్తున్నారు. 4 కిలోమీటర్ల పరిధిలోని స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు రూ.395 చెల్లిస్తే మూడు నెలల పాటు చెల్లే బస్ పాస్ అందిస్తారు,. అలాగే 8 కిలోమీటర్ల పరిధిలో అయితే రూ.485 చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.
బస్ పాస్ పొందటం ఎలా?
మరోవైపు విద్యార్థులు బస్ పాస్ పొందాలంటే.. వారు చదివే విద్యాసంస్థలు పూర్తి వివరాలతో జాబితాలను ఆర్టీసీ అధికారులకు అందిస్తారు. ఆ తర్వాత విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్పాస్ దరఖాస్తులో తమ పూర్తి వివరాలు నింపి., ఆ దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రింట్తో పాటుగా కాలేజీ జారీ చేసే ధ్రువీకరణపత్రం, ఆధార్ జిరాక్స్ జత చేసి బస్స్టేషన్లో సమర్పించాలి. ఆర్టీసీ అధికారులు విద్యాసంస్థలు పంపిన జాబితాలో వివరాలు సరి చూసి పాస్ మంజూరు చేస్తారు. ఇక ఉచిత బస్ పాస్ కోసం అయితే స్కూలు హెచ్ఎం ధ్రువీకరించిన పత్రం, దరఖాస్తు ప్రింట్,ఆధార్కార్డు జిరాక్స్ సమర్పిస్తే సరిపోతుంది.