స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ గా మారిపోయింది. చలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత గీతగోవిందం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుంది. మహేష్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది రష్మిక.ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది ఈ చిన్నది. రీసెంట్ గా కుబేర సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఈ నేషనల్ క్రష్. అయితే రష్మికాకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మికకు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రష్మికాను కలవాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. తాజాగా తనను కలవడానికి ఓ క్రేజీ అఫర్ ఇచ్చింది రష్మిక. నేనే నేరుగా మీ వద్దకు వచ్చి కలుస్తాను అని చెబుతుంది ఈ చిన్నది. తాను వచ్చి కలవాలంటే తాను చెప్పిన పని చేయాలి అని అంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో