Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కుక్క రక్తంతో క్షుద్రపూజలు..? పెట్ డాగ్‌ను అతి క్రూరంగా చంపిన యువతి

29 June 2025

health Tips: వంటల్లో ఈ పిండిని అతిగా వాడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

29 June 2025

Shefali Jariwala Death: షెఫాలీ మరణం వెనుక మిస్టరీ ఏంటి..? అందమే ఆమెను చంపిందా..?

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nadikudi Srikalahasti Railway Line,తీరనున్న ఏళ్లనాటి కల.. ఆ రూట్లో నడవనున్న రైలు.. వచ్చే నెల నుంచే.. – nanded tirupati special train run on new piduguralla savalyapuram section on nadikudi srikalahasti railway line
ఆంధ్రప్రదేశ్

Nadikudi Srikalahasti Railway Line,తీరనున్న ఏళ్లనాటి కల.. ఆ రూట్లో నడవనున్న రైలు.. వచ్చే నెల నుంచే.. – nanded tirupati special train run on new piduguralla savalyapuram section on nadikudi srikalahasti railway line

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nadikudi Srikalahasti Railway Line,తీరనున్న ఏళ్లనాటి కల.. ఆ రూట్లో నడవనున్న రైలు.. వచ్చే నెల నుంచే.. – nanded tirupati special train run on new piduguralla savalyapuram section on nadikudi srikalahasti railway line
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతిలో కీలకమైన నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. ఈ మార్గంలోని న్యూ పిడుగురాళ్ల – శావల్యాపురం స్టేషన్ల మధ్య తొలిసారిగా రైలు కూత పెట్టనుంది. ఇప్పటి వరకూ ఈ మార్గంలో కేవలం గూడ్స్ రైళ్లే రాకపోకలు సాగించగా.. జులై 4 నుంచి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. జులై 4 నుంచి జులై 26 వరకూ నాందేడ్ తిరుపతి ప్రత్యేక రైలు ఈ మార్గంలో రాకపోకలు సాగించనుంది. అయితే శావల్యాపురం రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్ లేకపోవటంతో..రైలు నిలిపేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

తీరనున్న ఏళ్లనాటి కల.. ఆ రూట్లో నడవనున్న రైలు.. వచ్చే నెల నుంచే..
తీరనున్న ఏళ్లనాటి కల.. ఆ రూట్లో నడవనున్న రైలు.. వచ్చే నెల నుంచే.. (ఫోటోలు– Samayam Telugu)

తమ ప్రాంతం మీదుగా రైలు నడవాలన్న వారి ఎన్నో ఏళ్ల కల నెరవేరే సమయం వచ్చేసింది. త్వరలోనే ఆ రూట్లో రైలు పరుగులు పెట్టనుంది. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే మార్గంలోని న్యూ పిడుగురాళ్ల – శావల్యాపురం మధ్య ప్రయాణికుల రైలు పరుగులు తీయనుంది. ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా.. ప్రయాణికుల రైలు మాత్రం పరుగులు తీసింది లేదు. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే ఈ మార్గంలో రాకపోకలు సాగించేవి. దీంతో ఈ ప్రాంతవాసులు.. ప్రయాణికుల రైలు ఎప్పుడు పరుగులు పెడుతుందా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

*రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం

ఈ క్రమంలోనే వారి ఆశలను నిజం చేస్తూ న్యూ పిడుగురాళ్ల- శావల్యపురం మార్గంలో రైలు పరుగులు తీయనుంది. జులై నాలుగో తేదీ నుంచి ఈ మార్గంలో ప్రతి శుక్రవారం రైలు పరుగులు తీయనుంది. జులై 4 నుంచి జులై 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం నాందేడ్ – తిరుపతి ప్రత్యేక రైలు ఈ మార్గం మీదుగా ప్రయాణించనుంది. అలాగే ప్రతి శనివారం తిరుపతి – నాందేడ్ రైలు ఈ రూట్లో నడవనుంది.

07189 నంబర్ గల ప్రత్యేక రైలు మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు బయలుదేరనుంది. ఈ రైలు నడికుడి రైల్వేస్టేషన్‌కు రాత్రి 12.05 గంటలకు , పిడుగురాళ్లకి రాత్రి 12.30 గంటలకు , నెమలపురి రైల్వేస్టేషన్‌కు రాత్రి 01.00 గంటలకు , రొంపిచర్లకి రాత్రి 01.25 గంటలకు, వినుకొండకు 02.00 గంటలకు చేరుకుంటుంది. అలాగే మార్కాపురం, దొనకొండ, కంభం రైల్వేస్టేషన్, నంద్యాల మీదుగా శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు ఇప్పుడు పిడుగురాళ్ల – శావల్యపురం మార్గంలో ప్రయాణించనుంది.

*ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

మరోవైపు ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 07190 నంబర్‌తో తిరుపతి నుంచి బయల్దేరనుంది. జులై 5 నుంచి జులై 26 వరకూ ప్రతి శనివారం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరనుంది. ఈ రైలు వినుకొండ రైల్వేస్టేషన్‌కు రాత్రి 10.05 గంటలకు, రొంపిచర్ల 10.25 గంటలకు, నెమలిపురి 10.35 గంటలకుకు, పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌కు10.45 గంటలకు, నడికుడి 11 గంటలకు, నాందేడ్‌కు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చేరుకుంటుంది.

అయితే న్యూ పిడుగురాళ్ల – శావల్యాపురం రైల్వే మార్గంలో నాందేడ్- తిరుపతి ప్రత్యేక రైలు నడుస్తున్నప్పటికీ.. శావల్యాపురం రైల్వేస్టేషన్‌లో మాత్రం స్టాపింగ్ లేదు. దీంతో ఈ రైలును ఇక్కడ నిలిపేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి