Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Chirala: ఈ ఇద్దర్ని అలలు మింగేశాయ్ – పాపం 2 కుటుంబాల్లో విషాదం

29 June 2025

Dog Vs Cat: కుక్క VS పిల్లి.. విశ్వాసం.. తెలివితేటల రేసులో ఏది ముందో తెలుసా?

29 June 2025

Cockroach In Srisailam Laddu,శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. శివ.. శివా! – srisailam laddu prasadam cockroach incident goes viral

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Warning To Mlas,అలా వెళ్తే టాటానే.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.. – cm chandrababu warning to mlas at tdp meeting in mangalagiri office
ఆంధ్రప్రదేశ్

Chandrababu Warning To Mlas,అలా వెళ్తే టాటానే.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.. – cm chandrababu warning to mlas at tdp meeting in mangalagiri office

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Warning To Mlas,అలా వెళ్తే టాటానే.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.. – cm chandrababu warning to mlas at tdp meeting in mangalagiri office
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TDP Chief Chandrababu Warning To MLAs: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పనితీరు మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాలను వివరించాలని, సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనితీరు బాగోని నేతలకు గుడ్ బై చెప్పేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అనవసరంగా విదేశీ పర్యటనలు వద్దని.. స్తానికంగా అందుబాటులో ఉండాలని సూచించారు.

టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్ (ఫోటోలు– Samayam Telugu)

టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే పూర్తైంది. మరో నాలుగేళ్లు సమయం ఉంది. అయితే అప్పటి వరకూ చంద్రబాబు రిలాక్స్ అవదలుచుకోలేదు. 2029 ఎన్నికలపై అప్పుడే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

*తీరనున్న ఏళ్లనాటి కల.. ఆ రూట్లో నడవనున్న రైలు.. వచ్చే నెల నుంచే..

ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పనితీరు బాగోలేని నేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. గుడ్ బై చెప్పేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

*ఒకే ఫ్రేములో వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అభిమాని కోరిక!

అలా వెళ్తే టాటానే.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్..

2029 ఎన్నికలే తన టార్గెట్ అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైసీపీ దారుణ రాజకీయాలకు పాల్పడుతోందని.. ప్రజలకు నేతలు వాస్తవాలు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఇక సోషల్‌ మీడియాతో మరింత జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులతో వ్యక్తిత్వ హననం జరుగుతోందని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందన్న చంద్రబాబు.. రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టామన్నారు. ఇప్పటి నుంచి నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచి పనిచేయాలని.. పనితీరు బాగోలేకుంటే నిర్మొహమాటం లేకుండా పక్కనబెట్టేస్తానని స్పష్టం చేశారు.

*రూ.50 చెల్లిస్తే ఏడాదంతా బస్సులో ఫ్రీ.. విద్యార్థులకు ఆర్టీసీ అద్భుత అవకాశం

వచ్చే ఎన్నికలకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేయాలన్న చంద్రబాబు.. తానా, ఆటా అంటూ విదేశీ పర్యటనలు వద్దని నేతలకు స్పష్టం చేశారు. అలా వెళ్తే వారికి టాటా చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చారు. “నిన్నటి నుంచే మొదలుపెట్టా. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాను. వన్ టూ వన్ మాట్లాడుతున్నా. అవసరమైతే ప్రతి రోజూ ఓ గంట కేటాయిస్తా. ఓ నలుగురితో మాట్లాడుతా. మీరు చెప్పింది వింటా. ఏవైనా ఉంటే నిర్మొహమాటంగా చెప్తా. మిమ్మల్ని గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే ఏ విధంగా ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకుపోదాం. ఎవ్వరి విషయంలోనూ మొహమాటం లేదు. పూర్తి క్లారిటీతో ఉన్నా.” అంటూ చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి