జేఎస్డబ్ల్యూకు చెందిన ఎంజీ మోటార్ ఇండియా తన కార్ మోడళ్లలో చాలా వరకు ధరలను జూలై 1, 2025 నుంచి 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ ఆధారంగా పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ఆర్థిక అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఎంజీ శ్రేణి కామెట్ ఈవీతో పెంపు ప్రారంభమవుతుంది. ఈ కారు ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), తరువాత విండ్సర్ ఈవీ రూ. 10 లక్షలు. ఐసీఈ మోడల్స్ రూ. 11.30 లక్షలతో ఆస్టర్తో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత హెక్టర్ రూ. 17.5 లక్షలతో వస్తుంది. అయితే టాప్-ఆఫ్-ది-లైన్ గ్లోస్టర్ ధర రూ. 41.07 లక్షలుగా ఉంది. ఎంజీకు సంబంధించిన ఎలక్ట్రిక్ మోడల్లు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఎంపికతో కూడా వస్తాయి. వినియోగదారులు బ్యాటరీ లేకుండా కారును కొనుగోలు చేయవచ్చు. అలాగే బ్యాటరీ కోసం సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది.
భారతదేశంలో లగ్జరీ వాహన విభాగంలోకి ప్రవేశించడానికి ఎంజీ మోటార్ సన్నాహాలు చేస్తోంది. ప్రీమియం కార్ల రంగంలోకి అడుగుపెట్టడానికి గుర్తుగా ఎం9 లిమోజిన్ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం చివర్లో స్టైల్, అధిక పనితీరును కలపడం లక్ష్యంగా పెట్టుకున్న ఆల్-ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు సైబర్స్టర్ను పరిచయం చేస్తుంది. ఈ లగ్జరీ లాంచ్ లకు మద్దతుగా ఎంజీ సెలెక్ట్ అనే కొత్త బ్యానర్ కింద ప్రీమియం డీలర్షిప్ను అందిస్తోంది.
ఈ అవుట్లెట్లు తమ ఫ్లాగ్షిప్ మోడళ్ల కొనుగోలుదారులకు మరింత వ్యక్తిగతీకరించిన, ఉన్నత స్థాయి కస్టమర్ ప్రయాణాన్ని అందిస్తాయి. ప్రస్తుత గ్లోస్టర్ నుంచి ప్రేరణ పొందిన లగ్జరీ ఎస్యూవీగా భావిస్తున్న మెజెస్టర్ను కూడా బ్రాండ్ టీజ్ చేసింది. ఇది త్వరలో ఎంజీకు సంబంధించిన ఇండియన్ లైనప్లో చేరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి