సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతోన్న దీపికా పదుకునే, అలియా భట్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ తదితరులు కూడా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. ఇక దక్షిణాదిలో నయనతార, రష్మిక మందన్నా, త్రిష, సమంత లాంటి క్రేజీ హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం నెక్ట్స్ లెవెల్. భాషతో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు రూ. 30-40 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటోంది. తద్వారా భారతీయ సినిమాలో చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ రికార్డుల కెక్కింది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఈ సొగసరికి అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉంది.
హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇంటర్నేషనల్ ఈవెంట్ల తో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. త్వరలోనే తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించేందుకు రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ అందాల తారనే హీరోయిన్ గా ఎంపికైంది. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. తను మరెవరో కాదు ప్రియాంక చోప్రా.
ఇవి కూడా చదవండి
ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫొటోస్..
మహేష్ బాబు- రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది. అయతే గతంలో సిటాడెల్ కోసం ప్రియాంక చోప్రా సుమారు $5 మిలియన్లు అంటే దాదాపు రూ.41 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ వెబ్ సిరీస్ మొత్తం రన్టైమ్ 6 గంటలు ఉంది. అదే క్రమంలో ప్రియాంకకు చెల్లించిన మొత్తం చాలా పెద్దది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆమె భర్త, ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ నెట్వర్త్ సుమారు రూ.666 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అలా వీరిద్దరి ఆస్తులు కలుపుకుని 1300 కోట్ల వరకూ ఉంటాయని తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .