Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Chirala: ఈ ఇద్దర్ని అలలు మింగేశాయ్ – పాపం 2 కుటుంబాల్లో విషాదం

29 June 2025

Dog Vs Cat: కుక్క VS పిల్లి.. విశ్వాసం.. తెలివితేటల రేసులో ఏది ముందో తెలుసా?

29 June 2025

Cockroach In Srisailam Laddu,శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక.. శివ.. శివా! – srisailam laddu prasadam cockroach incident goes viral

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annadata Sukhibhava Funds Release,అన్నదాత సుఖీభవ డబ్బులు పడేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు.. – ap cm chandrababu said annadata sukhibhava funds release with pm kisan yojana on july
ఆంధ్రప్రదేశ్

Annadata Sukhibhava Funds Release,అన్నదాత సుఖీభవ డబ్బులు పడేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు.. – ap cm chandrababu said annadata sukhibhava funds release with pm kisan yojana on july

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annadata Sukhibhava Funds Release,అన్నదాత సుఖీభవ డబ్బులు పడేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు.. – ap cm chandrababu said annadata sukhibhava funds release with pm kisan yojana on july
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. వివిధ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. జులై నెలలో పీఎం కిసాన్ యోజనతో నిధులు విడుదల చేసిన రోజే.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమచేస్తామని చంద్రబాబు వెల్లడించాుర.

అన్నదాత సుఖీభవ డబ్బులు పడేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు..
అన్నదాత సుఖీభవ డబ్బులు పడేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు.. (ఫోటోలు– Samayam Telugu)

ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జులై నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు.. పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
పీఎం కిసాన్ యోజన సాయాన్ని కేంద్రం మూడు విడతల్లో అందిస్తుందని.. అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా జమచేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.6000 అందించనుంది. ఈ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14000 జతచేసి ఏటా అర్హులైన రైతులకు రూ.20000 మూడు విడతల్లో అందించనుంది. తొలి విడత నిధులు జూన్ నెలాఖరులో విడుదల చేస్తారని వార్తలు రాగా.. కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేయలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల కూడా వాయిదా పడింది. జులై నెలలో విడుదల చేస్తామని చంద్రబాబు తాజాగా వెల్లడించారు.

మరోవైపు ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్న సంగతి తెలిసిందే. దీనితో పాటుగా మరో కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 పౌరసేవలను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈ సేవలను మరింత పెంచాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15 నుంచి 703 పౌర సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పెంచి ఇస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని తిరిగి పట్టాలెక్కించామని.. పోలవరం ప్రాజెక్టు పనులను కూడా మొదలుపెట్టినట్లు వివరించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి